ఉగ్ర రూపం దాల్చిన వరుణుడు... 24 మంది మృతి...పలువురు గల్లంతు... !
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలకు 24 మంది మృతి చెందగా, పలువురు గల్లంతు అయినట్టు సీఎం సుఖ్వీందర్ సింగ్ తెలిపారు. గత రాత్రి సోలన్ జిల్టాలో క్లౌడ్ బరస్ట్ వల్ల ఏడుగురు మరణించినట్టు పేర్కొన్నారు. ఇక సిమ్లాలో శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.