China: చైనాలో బీభత్సం సృష్టించిన కొండచరియలు.. శిథిలాల కింద 47 మంది..
చైనాలో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. యునాన్ ప్రావిన్స్లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో ఏకంగా 47 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరో ఇద్దరు చనిపోయినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తెచ్చేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.