Janasena: జనసేన అభిమానులకు హ్యాకర్స్ షాక్
జనసేనకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్కు గురైంది. ఛానల్ను రికవరీ చేసేందుకు జనసేన టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. సాంకేతిక నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు.
జనసేనకు హ్యాకర్లు షాక్ ఇచ్చారు. పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్కు గురైంది. ఛానల్ను రికవరీ చేసేందుకు జనసేన టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. సాంకేతిక నిపుణులతో చర్చలు కూడా జరుపుతున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి టీడీపీ నేతలతో జరిపిన భేటీ సఫలం అయ్యింది. దాదాపు గంటపాటు ఆయన సుదీర్ఘంగా మాట్లాడిన తీరుతో టీడీపీ ముఖ్యనాయకులు శాంతపడినట్లే కనిపించారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి పనిచేసేందుకు సూత్రప్రాయంగా వారంతా అంగీకారం తెలిపారు .
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పార్టీ తరఫున సమన్వయం కోసం ఓ కమిటీని నియమించారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. దీనికి పార్టీ ఉపాధ్యాక్షులు బొంగునూరి మహేంధర్ రెడ్డి సమన్వయకర్తగా పనిచేస్తారు.
నేటి రాజకీయాలు డబ్బు మయం అయ్యాయని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. సినీ గ్లామర్ కు ప్రజలు ఓటు వేయరని అన్నారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ ముఖ్యమంత్రులు అయినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
చంద్రబాబు నివాసంలో కూటమి నేతల భేటీ ముగిసింది. సీట్ల మార్పుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనపర్తి, ఉండి స్థానాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అనపర్తి టీడీపీకి ఇవ్వాల్సి వస్తే.. ఓ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
సినీ తారల ఎంట్రీతో పిఠాపురం పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరుఫున జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచార రంగంలోకి దిగారు. గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కచ్చితంగా పవన్ లక్షకుపైగా మెజార్టీతో గెలుస్తారన్నారు.
నరసాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు కనిపిస్తున్నాయి. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాధవ నాయుడు ఇప్పుడు రెబల్గా పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. నరసాపురం అసెంబ్లీ సీటుని జనసేనకు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో శివరామరాజుకి ఘోర అవమానం జరిగింది.
జనసేన అధినేత పవన కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన స్టార్ క్యాంపెయినర్గా అంబటి రాయుడును నియమించారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రాయుడుతో పాటు కొణిదెల నాగబాబు, హైపర్ ఆది, పృథ్వీ, గెటప్ శ్రీను, మొగలిరేకులు శ్రీ సాగర్, జానీ మాస్టర్ పేర్లను ప్రకటించారు.