కేంద్రంలో చక్రం తిప్పనున్న చంద్రబాబు
ఉపాధ్యాయుల బదిలీల్లో కోట్ల రూపాయల స్కామ్ జరిగితే.. డీజీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నాదెండ్ల మనోహార్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు..ఎన్ని కేసులు వచ్చాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుంభకోణాలపై చర్యలు తీసుకుంటామని నాదెండ్ల తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని గద్దె దించేందుకు జనసేన వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నుంచి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీలో జిల్లాల పర్యటనలు చేపడుతారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఫిబ్రవరి నుంచి క్షేత్రస్థాయిలో సమావేశలు నిర్వహిస్తామని అన్నారు.
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ భేటీ అయ్యారు. జనసేన తమ మిత్రపక్షమే అని పురందేశ్వరి అన్నారు. పొత్తులతో పాటు పార్టీ బలోపేతం పై నాదెండ్లతో చర్చించినట్లు పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.
జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ సర్కార్ పేదలను వంచిస్తోందని మండిపడ్డారు జనసేన నాదెండ్ల మనోహర్. భూ సేకరణ పేరుతో అవినీతి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల ద్వారా లబ్ధి పొందింది కేవలం జగన్, వైసీపీ ప్రజా ప్రతినిధులు మాత్రమేనని అన్నారు.
విద్యా వ్యవస్థలో స్కాంలు జరుగుతున్నాయని జనసేన ఆరోపించడంపై మంత్రి బొత్స స్పందించారు. టోఫెల్ విద్యా విధానంపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్దేశ్యం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు ఇస్టారాజ్యంగా మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. టోఫెల్ లో 4500 కోట్లు స్కాం అని నాదెండ్ల మనోహర్ అంటున్నారని..ఇందులో స్కాం ఎక్కడ ఉందో మనోహర్ చూపించాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స.
Pawan Kalyan Varahi Yatra in Visakhapatnam: విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు. శుక్రవారం విశాఖకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో జరిగిన బహిరంగ సభ విజయవంతంపై ప్రతీఒక్కరినీ అభినందించారు. విశాఖ పరిధిలో పవన్ కళ్యాణ్ చేపట్టే కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపై పవన్ పర్యటన షెడ్యూల్పై నేతలతో నాదెండ్ల చర్చించి ఖరారు చేశారు.
జనసేన పార్టీ రోజు రోజుకూ బలపడుతోందని, జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాని నాదెండ్ల తెలిపారు. వారాహి యాత్ర ప్రారంభం నుంచి నియోజకవర్గాల్లో సమస్యలపై పవన్ కళ్యాణ్ పూర్తి అవగాహన తెచ్చుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైపీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నాదెండ్ల. ఇందులో భాగంగానే ఎన్ని..
ఇప్పుడు అందరి చూపు పవన్ కల్యాణ్ పై ఉంది. మొదటి రెండు విడతల వారాహి యాత్రలతో వైసీపీకి వణుకు పుట్టించిన పవన్ మూడో విడత యాత్రలో ఏం చేయబోతున్నారు? ఎలాంటి మెరుపులు మెరిపించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.