ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. బీఆర్ఎస్ నేతల దౌర్జన్యం
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని చంద్ర గార్డెన్లో కులవృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అయితే.. వేదిక మీద ప్రజా నాయకులకు చోటులేద, పార్టీ లీడర్లకే పరిమితమని బీజేపీ కౌన్సిలర్ ఎమ్మెల్యేను నిలదీయడంతో రాజు అనే వ్యక్తిపై దాడి చేశారు. దీంతో సహనం కోల్పోయిన బీజేపీ నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.