Isreal attacks:గాజాలో శరణార్ధుల శిబిరాల మీద ఇజ్రాయెల్ దాడి..73మంది మృతి
గాజాలో ఇజ్రాయెల్ దాడులు విపరీతం అవుతున్నాయి. ఎవ్వరినీ క్షమించకుండా అటాక్ చేస్తోంది. వాళ్ళ లక్ష్యం హమాసే అయినప్పటికీ సాధారణ పాలస్తీనాయన్లు బలైపోతున్నారు.
గాజాలో ఇజ్రాయెల్ దాడులు విపరీతం అవుతున్నాయి. ఎవ్వరినీ క్షమించకుండా అటాక్ చేస్తోంది. వాళ్ళ లక్ష్యం హమాసే అయినప్పటికీ సాధారణ పాలస్తీనాయన్లు బలైపోతున్నారు.
గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇళ్ళు, ఆసుపత్రులు...అన్నింటి మీదా దాడి చేస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రి మీ దాడి చేయగా 15 మంది చనిపోయారు. మరో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాలో బీభత్సం సృష్టిస్తోంది. ఈక్రమంలో తమ దేశానికి చెందిన ఓ సైనికురాలిని సైన్యం విడిపించుకుంది. మరోవైపు గాజాలో కాల్పుల విరమణ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.
ఇజ్రాయెల్ - హమాస్ వార్ 21 రోజులకు చేరింది. పోరు తీవ్రం అవుతోందే తప్పా.. ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. హమాస్ ను శాశ్వతంగా నాశనం చేసే వరకు విరమించేదే లేదు అంటోంది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయక , సామాన్య ప్రజలు మరణించడం మీద భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఆపి, శాంతిని స్థాపించేందుకు ఇరు వర్గాలు మళ్ళీ చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థిలు మీద ఐరాస భద్రతా మండలిలో జరగిన చర్చలో ఇండియా ఈ వ్యాఖ్యలను చేసింది.
హమాస్ మిలిటెంట్లు మరో ఇద్దరు బందీలను విడుదల చేసారు.ఈజిప్ట్-ఖతార్ మధ్యవర్తిత్వం తర్వాత మానవతా దృక్పథంతో ఇద్దరు వృద్ధ మహిళలను విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించంది. మిలిటెంట్ల చేతిలో మొత్తం 222 మంది బందీలుగా ఉన్నారు.
ఇజ్రాయెల్ మీద రసాయన ఆయుధాల దాడులకు హమాస్ సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉందన్నారు. తమ సైన్యం దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్ సాయుధుడి వద్ద రసాయన ఆయుధాలకు సంబంధించిన ఆధారాలు లభించాయని చెప్పారు.
నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది.
ఇజ్రాయెల్ దాడులతో గాజా పట్టణం వణుకుతోంది. ఉత్తర గాజాలో దాడులు చేస్తాము అక్కడి నుంచి తరలివెళ్ళిపోండి అని ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయించింది ఇజ్రాయెల్. దీంతో అక్కడి ప్రజలంతా 20 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి దక్షిణ గాజాకు చేరుకున్నారు. కానీ ఇజ్రాయెల్ అక్కడ కూడా దాడులు చేస్తోంది. దీంతో పాలస్తీనియన్ల పరిస్థితి దారుణంగా తయారైంది. అయితే ఎట్టకేలకు ఇజ్రాయెల్ కాస్త వెనక్కి తగ్గింది. అమెరికా చెప్పిన మాటలను కాస్త చెవికి ఎక్కించుకుని గాజాకు మానవతా సహాయం చేసేందుకు రఫా దారులను ఓపెన్ చేసింది.