11వ తరగతి ఖతర్నాక్ కుర్రోడు.. 200 మందిని నిలువునా ముంచేశాడు..!
రాజస్థాన్లో అజ్మీర్ జిల్లాలో 11వ తరగతి చదువుతున్న 19 ఏళ్ల కాషిఫ్ మీర్జా ఘరానా మోసం చేశాడు. సోషల్ మీడియా వేదికగా పెట్టుబడి పథకాల గురించి చెప్పి మభ్యపెట్టాడు. అలా 200 మందిని మోసం చేసి రూ.45 లక్షలు కాజేశాడు. తాజాగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.