USA: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి.. ఈ ఏడాది పదో ఘటన
అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి చెందాడు. ఓహియో రాష్ట్రంలోని క్వీన్ ల్యాండ్లో చదువుకుంటున్న ఉమా సత్యసాయి గద్దె అనే విద్యార్థి మరణించినట్లు.. అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీంతో ఈ ఏడాది మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరుకుంది.