బయలుదేరిన కొన్ని క్షణాలకే కూలిన హెలికాప్టర్.. ముగ్గురు దుర్మరణం
మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6:45 నిమిషాలకు పూణెలో బయలుదేరిన హెలికాప్టర్ క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. పొగమంచు వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.