Israel-Hamas conflict:ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన 50మంది బందీలు?
ఇజ్రాయెల్ - హమాస్ వార్ 21 రోజులకు చేరింది. పోరు తీవ్రం అవుతోందే తప్పా.. ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. హమాస్ ను శాశ్వతంగా నాశనం చేసే వరకు విరమించేదే లేదు అంటోంది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ - హమాస్ వార్ 21 రోజులకు చేరింది. పోరు తీవ్రం అవుతోందే తప్పా.. ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు. హమాస్ ను శాశ్వతంగా నాశనం చేసే వరకు విరమించేదే లేదు అంటోంది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయక , సామాన్య ప్రజలు మరణించడం మీద భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఆపి, శాంతిని స్థాపించేందుకు ఇరు వర్గాలు మళ్ళీ చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థిలు మీద ఐరాస భద్రతా మండలిలో జరగిన చర్చలో ఇండియా ఈ వ్యాఖ్యలను చేసింది.
నిన్నటి వరకు ఒక లెక్క...ఇప్పుడు ఒక లెక్క అంటున్నారు ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు. నిన్నటి వరకు క్షిపణులు, వైమానికి దాడులు చేసుకున్న ఇరు వర్గాలు మొదటిసారిగా ప్రత్యక్షంగా తలపడ్డారు. నిన్న గాజాలో ముఖాముఖి పోరు చేసుకున్నామని హమాస్ సైనిక విభాగం అల్-ఖసమ్ బ్రిగేడ్స్ చెప్పింది.
హమాస్ను మట్టుబెట్టే లక్ష్యంతో ముందుకు వెళుతోంది ఇజ్రాయెల్. క్షిపణులు, వైమానిక దాడులతో గాజా మీద విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో మరింత సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించింది. భూదాడులు నిర్వహించి హమాస్ను సమూలంగా నాశనం చేయాలనే అనుకుంటోంది. కానీ గాజాలో భూదాడులు చేయడం అంత ఈజీ కాదని నిపుణులు అంటున్నారు. గాజా కింద మరో గాజా ఉందని చెబుతున్నారు.
గాజాలో ఆసుపత్రి దాడిలో 500 మంది అక్కడిక్కడే చనిపోయారు. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్లు ఒకరినొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉగ్రవాదులు ప్రయోగించిన రాకెట్టే గురితప్పి ఆ దారుణం జరిగిందని ఇజ్రాయెల్ అంటోంది. ఇది కచ్చితంగా ఉగ్రమూకల దుశ్చర్యే అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ధాలెప్పుడూ మానవాళికి చేటే చేస్తాయి. ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం అమాయక ప్రాణాలను బలి తీసుకుంది. గాజాలో ఓ ఆసుపత్రి మీద బాంబు పడి దాదాపు 500 మంది మృత్యువాత పడ్డారు.
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం పదోరోజుకు చేరుకుంది. ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న గాజా పరిస్థితి మరింత దారుణంగా మారబోతోందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకరి మీద ఒకరు విమానాలు, క్షిపణులతో దాడులు చేసుకుంటున్నారు. దీనికి తోడు 3 లక్షలకు పైగా సైన్యంతో గాజాను చుట్టుముట్టడానికి ఇజ్రాయెల్ రెడీగా ఉంది. ప్రభుత్వ ఆదేశాల కోసం వారు ఎదురుచూస్తున్నారు.
ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గత కొన్ని రోజుల నుంచి గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తూ విరుచుకుపడుతోంది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది.
గాజాలో ఇజ్రాయెల్ బలగాలు అడుగుపెట్టేసాయి. హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గ్రౌండ్ ఆపరేషన్ రెడీ అయిపోయింది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం భూ దాడులు చేయడం మొదలుపెట్టేసింది. హమాస్ మిలిటెంట్ల దగ్గర ఉన్న తమ బందీలను విడిపించేందుకే ఈ ఆపరేషన్ ను చేస్తున్నామని చెబుతోందది ఇజ్రాయెల్ సైన్యం.