CRIME : తండ్రి అప్పు తీర్చలేదని కుమార్తెను కిడ్నాప్ చేసిన వ్యాపారి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే...
స్వాతంత్ర దినోత్సవం రోజునే ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి చేసిన అప్పు తీర్చలేదని ఓ వ్యాపారి అతని కూతుర్ని కిడ్నాప్ చేశాడు. స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బాలికను తీసుకెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెండు గంటల్లోనే కేసును ఛేదించారు.