Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు...23 మంది ఆర్మీ గల్లంతు
సిక్కిం రాష్ట్రాన్ని మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. నిన్న రాత్రి కురిసిన ఎగతెగని వర్షానికి అక్కడి తీస్తా నది ఉప్పొంగి లాచెన్ లోయ మొత్తం మునిగిపోయింది. అదే లోయలో ఉన్న ఆర్మీ పోస్టులు నీట మునిగిపోవడంతో అందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు.