Lok Sabha Elections : ఇతర సిరాతో ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు : ముకేష్ కుమార్
చెరగని సిరాతో ఓటర్లు వేళ్లపై వారి ఇంటి దగ్గరే మార్కు చేస్తూ ఓటు వేయకుండా కుట్ర జరుగుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఖండిచారు. చెరగని సిరాను ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని స్పష్టం చేశారు.