AP News: మట్టి మిద్దె కూలి కుటుంబం మృతి.. రూ.10 లక్షల సాయం ప్రకటించిన చంద్రబాబు!
నంద్యాల జిల్లా చిన్నవంగలి గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనాథగా మిగిలిన బాలికకు రూ.10 లక్షల సాయం ప్రకటించారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి అండగా ఉంటామన్నారు.