సీఎంపై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు?
తెలంగాణ బీజేపీకి డిసెంబర్లో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, పాయల్ శంకర్ ఈ పదవి కోసం రేసులో ఉన్నారు. హైకమాండ్ వీరిలో ఎవరి వైపు మొగ్గు చూపనుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. 30 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన కాషాయ జెండా ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ రూ.30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేపిదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. దీనికి వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొడంగల్ లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ లోక్ సభ ఎన్నికల్లో మెదక్లో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు నామినేషన్లను దాఖలు చేశారు. అర్వింద్ తనకు రూ.109.90 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆఫిడవిట్లో పేర్కొనగా.. తనకు 21.07 కోట్ల మేర ఆస్తులు ఉన్నట్లు తెలిపారు రఘునందన్రావు.
మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సారి బీజేపీ 400 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. అందులో మెదక్ నియోజకవర్గాన్ని కూడా భాగం చేయాలన్నారు.
గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాణేనికి బొమ్మ బొరుసులాంటి పార్టీలు అని కామెంట్స్ చేశారు.