Bhadrachalam: భద్రాచలంలో మళ్లీ పెరిగిన వరద.. 2వ ప్రమాద హెచ్చరిక జారీ..!
భద్రాచలం దగ్గర మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు తిరిగి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి 51 అడుగుల దగ్గర ప్రవహిస్తోంది. 12 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.