Telangana : రేవంత్, చంద్రబాబు భేటీపై.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారని.. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
విభజన సమస్యలు కేసీఆర్ వల్లే పరిష్కారం కాలేదని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. చంద్రబాబు, రేవంత్ సఖ్యతతో ఉన్నారని.. వాళ్లు చిత్తశుద్ధితో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు.
ఢిల్లీలో 18వ లోక్ సభ కొలువుతీరింది. మదటి రోజు ప్రధాని మోదీతో పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు లోక్సభకు పంచెకట్టుకు హాజరవ్వడమే కాక తెలుగులో ప్రమాణం చేశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పద్మభూషణ్ చిరంజీవిని కలిశారు. జూబ్లిహిల్స్ లోని తన నివాసానికి సాదరంగా ఆహ్వానించి సంజయ్ కి శాలువా కప్పి సత్కరించారు చిరు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఒకరినొకరు కొనియాడారు.
బీజేపీ అధికారంలోకి రాగానే..భాగ్యలక్ష్మీ ఆలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’ గా మారుస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ .అమ్మవారి దయవల్లే బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసే వరకు పోరాడతామని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు.
TG: కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టారు బండి సంజయ్. కరీంనగర్ గడ్డకు కమాన్ వద్ద ప్రణమిల్లి సాష్టాంగ నమస్కారం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బండి సంజయ్ సాష్టాంగ నమస్కారం చేయడంతో బీజేపీ శ్రేణుల కేరింతలు కొట్టారు.
మెదక్లో శనివారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. పోలీసులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హింసకి ఎవరు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నాం అని కిషన్ రెడ్డి అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు.
ఈ నెల 13న ఉదయం 11 గంటలకు ఎంపీలు కిషన్రెడ్డి, బండి సంజయ్ కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, శ్రీనివాస వర్మ గురు లేదా శుక్రవారం కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారు.
TG: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయకమంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడ వెళ్లనున్నారు. రేపు సీఎం ప్రమాణ స్వీకారం అనంతరం.. తిరిగి ఢిల్లీకి పయనం కానున్నారు.