Lokesh Yuvagalam: యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తరువాత..ఇదే తొలిసారి!
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను సుమారు 12 గంటల పాటు ఆగకుండా నిర్వహించారు. యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత ఆయన నిర్విరామంగా చేపట్టిన యాత్ర ఇదే.
టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రను సుమారు 12 గంటల పాటు ఆగకుండా నిర్వహించారు. యువగళం పాదయాత్ర మొదలు పెట్టిన తరువాత ఆయన నిర్విరామంగా చేపట్టిన యాత్ర ఇదే.
ఏపీలో 35 సర్పంచ్ స్థానాలకు,245 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఏలూరు, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. కడప జిల్లా సుగమంచిపల్లె వాసులు ఎన్నికలను బహిష్కించారు. పంచాయతీఎన్నికలు ఎలా సాగుతున్నాయంటే...
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన వాతావరణశాఖ ఇచ్చింది. మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.
ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తూంటే విపక్ష నాయకులు, జనసేన అధ్యక్షుడు పవన్ చూసి ఓర్వలేకపోతున్నారని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన అంటున్న మాటలు వింటుంటే ఈ ప్రాంతం అంతా వెనకబడి ఉంటేనే ఆయనకు నచ్చేటట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.
సుమారు 45 రోజుల నుంచి ఆందోళనలు చేపట్టినప్పటికీ కూడా కనీసం పోర్టు యజామాన్యం నుంచి కనీస స్పందన రాలేదని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో గురువారం పోర్టు ముట్టడికి కార్మిక సంఘాలు పిలుపుని ఇచ్చాయి. దీంతో గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.
ఏపీ(ap) కి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రపంచ వేదికపై ప్రసంగించనున్నారు. ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులకు ఐరాస(uno)లో ప్రసంగించే అవకాశం రావడంతో ఆ విద్యార్థులపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎం. శివలింగమ్మ, సీ. రాజేశ్వరిలు ఐరాస సమావేశానికి హాజరవుతారని అధికారులు తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గతంలో విజన్ 2020 అన్న వాడు ఇప్పుడు విజన్ 2047 అంటున్నారని మండిపడ్డారు.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. భక్తుల అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడానికి తరలి వస్తుండటంతో స్వామి ఆదాయం కూడా భారీ స్థాయిలో వస్తుంది. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల ఇంకా అధికంగా స్వామి వారి కానుకలు పెరిగాయి.
ఏపీలో పంచాయతీలకు సర్పంచ్లు, వార్డుసభ్యుల ఎన్నిక జరిపేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ను విదుదల చేసింది జారీ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల నిబంధనల ప్రకారం నేడు రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదేరోజు ఎన్నికలు జరిగే పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు.నేటి నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లపై అభ్యంతరాలను 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయవచ్చు.