మిథున్ రెడ్డిVSగల్లా జయదేవ్...మరీ ఇంతలా కొట్టుకోవాలా?
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో వేసిన క్వాట్ పిటిషన్ మీద హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. అలాగే మరో రెండు బెయిల్ పిటిషన్ల మీద కూడా ఏసీబీ కోర్టులో విచారణకు రానున్నాయి. బెయిల్ కనుక మంజూరు అయితే బాబు ఈరోజు బయటకు వస్తారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు విచారణ మీదనే ఉంది.
రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కలిశారు. వారితో మాజీ మంత్రి యనమల రామకృష్ణ కూడా ఉన్నారు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవడంపై రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. ఆయన తప్పు ఉంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని అన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కావడంతో గౌరవం ఇచ్చామని, ఆ గౌరవంతోనే జైలుకు తరలించేందుకు చాపర్ కూడా ఏర్పాటు చేశామన్నారు.
చంద్రబాబు అరెస్ట్, తరువాత జరిగిన పరిణామాల మీద కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఏం జరిగింది అన్న దాని మీద నివేదిక ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు. రూ. 3,300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కేసులో రూ. 370 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించామన్నారు.
చంద్రబాబు లాయర్ ట్వీట్ పై వేసీపీ నేతల ఫైరింగ్ | YCP Counter on Lawyer Sidharth Luthra Tweet | Ambati Rambabu
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడం అన్యాయమని డీజీ టెక్ కంపెనీ ఎండీ వికాస్ ఖన్వెల్కర్ ఇంతకు ముందే చెప్పారు. ఇప్పుడు దానికి సంబంధించి 2022లో డిజైన్ టెక్ సంస్థ ఏపి స్కిల్ డెవెలప్మెంట్ కోసం చేసిన వెండర్ చెల్లింపులు, టాక్సుల పూర్తి వివరాలతో కూడిన లేఖను బయటపెట్టారు.