ఏపీలో విషాదం.. చెరువులో ఏడుగురు విద్యార్థులు గల్లంతు..
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అనంత రైతులకు పంట నష్టం..| Farmers Incur Losses on Grape Crops| RTV
అనంత రైతులకు పంట నష్టం..| Farmers Incur Losses on Grape Crops| in Andhra pradesh and anticipate the Support of Government to recoup losses RTV
AP: వితంతువుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులు.. ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా అంటూ..!
అనంతపురం జిల్లా శింగనమలలో వితంతువును ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ వేధింపులకు గురిచేశాడు. 'అక్కా' అంటూనే తన లైంగిక వాంఛ తీర్చాలని పదే పదే ఫోన్స్ చేసి ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధిత మహిళ అతడు మాట్లాడిన ఆడియో ఆధారంగా పోలీసులను ఆశ్రయించింది.
AP: కొత్త టెక్నాలజీతో భారీగా మొబైల్స్ రికవరీ..!
అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు. రూ. 53 లక్షల విలువ చేసే 266 సెల్ ఫోన్లను తాజాగా రికవరీ చేశారు. ఇప్పటివరకు చాట్ బాట్ సేవల ద్వారా 15. 04 కోట్లు విలువచేసే 8886 ఫోన్లను రికవరీ చేసినట్టు ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు.
AP: రాష్ట్ర నీటి హక్కులను కాపాడండి.. కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన.!
మన రాష్ట్ర నీటి హక్కులను కాపాడాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ గేటు ఎదుట బైఠాయించి.. కృష్ణా జలాలు పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
MLA : ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలచిపోతుంది: ఎమ్మెల్యే సురేంద్రబాబు
మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత చంద్రబాబుదన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు. మాజీ సీఎం జగన్కు రూ. 1000 పెంచడానికి ఐదేళ్లు సమయం పట్టిందని విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలచిపోతుందన్నారు.
AP: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. ఎమ్మెల్యే M.S రాజు సీరియస్ వార్నింగ్..!
అనంతపురం జిల్లా మడకశిరలో సంతలో సుంకం వసూలు చేసే వారిపై ఎమ్మెల్యే M.S రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సుంకం వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
AP: జగన్పై విమర్శలు కాదు.. రాష్ట్రంలో జరుగతున్న హింసను అరికట్టండి: ZP చైర్మన్
కూటమి ప్రభుత్వం జగన్పై విమర్శలు చేయడం కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేయాలన్నారు అనంతపురం ZP చైర్మన్ బోయ గిరిజమ్మ. ఏపీలో జరుగుతున్న దాడులను, హింసను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరచాలన్నారు.
/rtv/media/media_library/vi/MjmLRDAFbZY/hq2.jpg)
/rtv/media/media_library/vi/pDLFTHkkcOg/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/20/aiOBtY0GXu8lrh3YsEw2.jpg)
/rtv/media/media_library/vi/SySE10DQftk/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/women-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/phones.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/atp-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/mla-5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ms-raju.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/atp-2-1.jpg)