చచ్చేంత వరకు జగన్ వెంటే: అంబటి రాంబాబు!
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
చంద్రబాబుకు బెయిల్ రావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. నిజం గెలిచి కాదు.. బాబుకు కళ్లు కనిపించట్లేదని బెయిల్ ఇచ్చారని సెటైర్లు వేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి రెప్పపాటు కాలంలో పెద్ద ప్రమాదమే తప్పింది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన అశ్వారావు పేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా..ఆయన కాన్వాయ్ మీద ఒక్కసారిగా గోధుమ బస్తాలు కారు బానెట్ పై పడ్డాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడాన్ని చూసి గాంధీజీ ఆత్మ క్షోబిస్తోందన్నారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత నారా లోకేష్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పైశాచికాచినందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. నా గురించి విమర్శలు చేసే స్థాయి లోకేష్ కు లేదన్నారు మంత్రి అంబటి. లోకేష్ రాజకీయ బఫూన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ సోదరులు అనమంటే బీసీ చౌదరిలు అంటున్నాడని.. వైశ్యులను వైశాలి అంటున్నాడని ఎద్దేవా చేశారు. లోకేష్ దిగజారుడు విమర్శలు చేస్తున్నాడని తీవ్రంగా మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నేను పండుగ సమయంలో డాన్స్ చేశా అయితే ఇప్పుడు ఏంటి? నేను మాట్లాడటం మొదలు పెడితే మీరంతా ఏడుస్తారు అంటూ ధ్వజమెత్తారు.
సినీ నటి రేణూ దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఈమేరకు రేణూ దేశాయ్ ని ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. 'అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!' అని రాసుకొచ్చారు. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా సోషల్ మీడియా వేదికగా రేణూ దేశాయ్ కి కౌంటర్లు ఇస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదికాస్తా వైరల్ గా మారింది.
మంత్రి అంబటి రాంబాబుకు మెగాస్టార్ చిరంజీవి పరోక్షంగా కౌంటర్లు వేశారు. పేదల కడుపునింపడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నేతలు దృష్టి పెట్టాలని.. అంతేకాని పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా సినీ ఇండస్ట్రీ గురించి ఎందుకంటూ ప్రశ్నించారు. ఇటివలి 'బ్రో' సినిమా గురించి అంబటి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి. పవన్ రెమ్యూనరేషన్ చెప్పాలంటూ అంబటి అడగడం.. 'బ్రో' సినిమా పెట్టుబడులపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయడం లాంటి పరిణామాల తర్వాత చిరు వ్యాఖ్యలు పవన్కు మద్దతుగా నిలుస్తుండడం మెగా ఫ్యాన్స్ని ఖుషీ చేస్తోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పలు ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు వేశారు. చంద్రబాబు! పోలవరం వస్తున్నారు కాబట్టి నేను వేసిన మూడు ప్రశ్నలకు ఇప్పుడైనా సమాధానం ఇస్తారా? అని నిలదీశారు.