Ambati Rambabu about AP Capital: గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ సీటు బీసీకి కేటాయించడం సీఎం జగన్ (CM Jagan) తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఏడు నియోజకవర్గల్లో ఓసీ అభ్యర్థులు మాత్రమే ఉన్నారని.. అందుకే పార్లమెంట్ స్థానానికి బీసీ అభ్యర్థిని తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను (YCP Candidates List) ప్రకటిస్తున్నామన్నారు. కానీ టీడీపీ, జనసేన (TDP-Janasena) మాత్రం వారి పొత్తులోనే ఇప్పటివరకు క్లారిటీ లేదని విమర్శలు గుప్పించారు.
Ambati Rambabu: రాజధానిపై మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్..
ఏపీకి రాజధాని ఏదంటే ప్రస్తుతానికి అమరావతి అని చెబుతానన్నారు మంత్రి అంబటి. అయితే తమ నినాదం, విధానం మాత్రం మూడు రాజధానులేనన్నారు. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: