Minister Ambati Rambabu: మీరు చొక్కాలు మడతపెడితే, మేం కుర్చీలు మడతపెట్టడమే అంటూ సీఎం జగన్ ను (CM Jagan) ఉద్దేశిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ (Lokesh) చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. ఆయన ట్విట్టర్ (X)లో లోకేష్ పై సెటైర్లు వేశారు. “నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!, కుర్చీ సంగతి తరువాత!” అంటూ లోకేష్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ప్రస్తుతం అంబటి చేసిన ట్వీట్ ను తెగ షేర్ చేస్తున్నారు వైసీపీ (YCP) కార్యకర్తలు. మరోవైపు అంబటి చేసిన ట్వీట్ పై విమర్శలు చేస్తున్నారు టీడీపీ (TDP) కార్యకర్తలు. ప్రస్తుతం ట్విట్టర్ లో వైసీపీ, టీడీపీ ఫ్యాన్స్ మధ్య అంబటి నిప్పు రాజేసినట్లైంది.
పూర్తిగా చదవండి..Ambati Rambabu: నాలుక మడతపడకుండా చూస్కో.. లోకేష్కు మంత్రి అంబటి కౌంటర్
నెల్లిమర్లలో నిర్వహించిన శంఖారావం సభలో సీఎం జగన్ను ఉద్దేశిస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఆయన ట్విట్టర్లో.."నాలుక మడత పడకుండా చూసుకో బాబూ లోకేష్!, కుర్చీ సంగతి తరువాత!" అంటూ ట్వీట్ చేశారు.
Translate this News: