కుంభమేళాలో మరో భారీ అగ్ని ప్రమాదం.. భయంతో భక్తులు పరుగులు
కుంభమేళాలోని సెక్టార్8లో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. యాత్రికులను ఖాళీ చేయించారు. భక్తులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. కుంభమేళాలో 30 రోజుల్లోనే 7సార్లు అగ్ని ప్రమాదాలు జరిగాయి.