Telangana: పార్లమెంటు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో రూ.104 కోట్లు స్వాధీనం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 28 వరకు నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.104.18 కోట్లు దొరికాయి. నగదు, మద్యం, ఆభరణాలు, విలువైన వస్తువులను ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి.