తీర్థం పేరిట జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తాగించి.. 11 మందిపై దారుణం
తాంత్రిక పూజలతో గుప్తనిధులు చూపించి ధనవంతులను చేస్తానని 11 మందిని హతమార్చిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. ప్రశ్నించిన బాధితులకు జిల్లేడు పాలు కలిపిన గేదె పాలు తీర్థం పేరిట తాగించి అపస్మారకస్థితికి చేరుకోగానే బండరాయితో కొట్టి చంపిన సత్యంను పోలీసులు అరెస్ట్ చేశారు.