Ganesh Visarjan: గణేష్ నిమజ్జన ఊరేగింపులో భక్తులపై రాళ్ల దాడి (VIDEO)
కర్ణాటకలోని మండ్య జిల్లాలో వినాయక విగ్రహాల నిమజ్జనం ఊరేగింపులో సోమవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మద్దూర్ పట్టణంలోని రామ రహీమ్ నగర్ వద్ద నిమజ్జనం ఊరేగింపు జరుగుతుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.