హర్యానాలోని గురుగ్రామ్ లో విశ్వహిందూ పరిషత్ చేపట్టిన మత ఊరేగింపు రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణకు దారి తీసింది. సోమవారం నుహ్ వద్ద వీహెచ్పి చేపట్టిన బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర నేపథ్క్ష్యంలో హింసచెలరేగింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగారు. దాదాపు 50వాహనాలకు నిప్పుపెట్టారు. హింసాత్మక ఘటనల్లో ఇద్దరు హోంగార్డులు మరణించారని..డీఎస్పీ సజ్జన్ సింగ్ తలకు గాయంకాగా, ఓ ఎస్సై తీవ్రంగా గాయపడ్డాడని స్థానిక పోలీసులు తెలిపారు.
పూర్తిగా చదవండి..కేంద్ర బలగాల ఆధీనంలో హర్యానా..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..!!
హర్యానా హింసాత్మకంగా మారింది. మేవాత్ లోని నుహ్ లో హిందూ సంస్థలు చేపట్టిన బ్రిజ్ మండల్ యాత్రలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు రాళ్లు రువ్వడంతోపాటు యాభై వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ హింసాకాండలో ఇద్దరు హోంగార్డులు మరణించారు. మరో పదిమందికిపైగా పోలీసులు గాయపడ్డారు.
Translate this News: