Khammam: ఎలుకల నిలయాలుగా గురుకులాలు.. విద్యార్థిని పరిస్థితి విషమం
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవడంతో ఓ విద్యార్థిని గాయపడింది. ఎలుకల దాడిలో నరాలు చచ్చుబడి విద్యార్థిని స్పర్శ కోల్పోయిందని భవాని కీర్తి తల్లి ఆరోపిస్తుంది.