Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని 25 మంది వ్యవసాయ కూలీలు అస్వస్థత చెందారు. మొక్కజొన్న పంటకు గుళికలు వేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వారంతా వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలు అందరూ ఆళ్లగడ్డ పట్టణంలోని ఆచార్య కాలనీకి చెందిన వారీగా గుర్తించారు.
nandyal
AP: సంచలనంగా మైనర్ బాలిక హత్య.. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్..!
Nandyal: నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి.. ఆ తరువాత మృతదేహాన్ని మల్యాల లిప్ట్ కెనాల్లో పడేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాల్వలో బాలిక మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నారు.
Also Read: తాడేపల్లిగూడెంలో జి.ఆర్.రెడ్డి కంటి హాస్పిటల్ వైద్యుల దోపిడి.. HIV పాజిటివ్ అని చెప్పి..
బాలిక మృతితో బాధిత కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక తల్లి మాట్లాడుతూ..తన బిడ్డను చంపిన వాళ్ళను ఎన్ కౌంటర్ చేసి చంపాలని డిమాండ్ చేస్తోంది. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. పనీపాటా లేకుండా తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్నారని వాపోయింది. తన మనవరాలిని చంపిన వాళ్ళను ఎన్ కౌంటర్ చేస్తేనే తమకు న్యాయం చేసినట్టు అవుతుందని బాలిక నానమ్మ అంటోంది.
Also Read: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి..
ముచ్చుమర్రిలో బాలిక మృతదేహం గాలింపును టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. బాలిక హత్య దారుణమని, నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గంజాయి పిల్లలకు కూడా చేరుతోందన్నారు. ముచ్చుమర్రిలో ఐదేళ్ల క్రితం క్రమశిక్షణ, కట్టుబాట్లతో ఉండేదని వ్యాఖ్యానించారు.
Breaking: కట్టెల కోసం వెళ్లిన మహిళ తలను తిన్న పులి.. ఏపీలో దారుణ ఘటన!
Breaking: నంద్యాల జిల్లాలో చిరుత పులి దాడి కలకలం సృష్టిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. తాజాగా, గిద్దలూరు ఘాట్ రోడ్డు లోని పచర్లలో అటవీ శివారులో చిరుత పులి దాడి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత దాడిలో ఓ మహిళ దారుణంగా బలైయింది.
Also Read: జగన్ బొమ్మ తీసేస్తా.. కుప్పంకు విమానాశ్రయం తెస్తా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!
వివరాల్లోకి వెళ్తే.. మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా అనే మహిళ అడవీలో కట్టెల కోసం వంక వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెపై చిరుత పులి దాడి చేసింది. షేక్ మెహరున్నిసా కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు వంక వద్దకు వెళ్లారు. అయితే, ఇలోపే చిరుత మహిళను చంపి మొండెంను ఎత్తుకుపోయింది.
Also Read: ఖమ్మం జిల్లాలో విషాదం.. తల్లీ, కొడుకు మృతి..!
స్థానికులు వెళ్ళేసరికి షేక్ మెహరున్నిసా మొండెం కనిపించలేదు. కాగా, నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై కూడా దాడి చేసి చిరుత గాయపరిచినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన అటవీ అధికారులు చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లను ఏర్పాటు చేశారు.
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి!
Nandyal District : మృత్యువు ఏ క్షణం ఎటు వైపు నుంచి దూసుకొస్తుందో తెలియదు. రెప్పపాటు కాలంలో ప్రాణాలు గాల్లో ఎగిరిపోతాయి. ఏమరపాటు మృత్యు కౌగిల్లోకి తీసుకెళ్తుంది. అప్పటివరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబాలు ఒక్కసారి తీవ్ర విషాదంలోకి వెళ్లిపోతాయి. కన్నీరుమున్నిరుగా విలపిస్తాయి. ముఖ్యంగా రోడ్లపై జర్నీ(Road Journey) అంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. రాత్రి ప్రయాణాలు(Night Journey) కచ్చితంగా రిస్కుతో కూడుకున్నవే. ఈ విషయం మరోసారి స్పష్టమైంది. నంద్యాల జిల్లా(Nandyal District) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతులు హైదరాబాద్ వాసులు:
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీనీ కారు ఢికొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. ఆళ్లగడ్డ(Allagadda) మండలం నల్లగట్ల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారంతా హైదరాబాద్ వాసులుగా తెలుస్తోంది. ట్రాఫిక్ అంతరాయం కాకుండా వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
ఇక మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇక మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. చనిపోయిన వారిలో రవీందర్తో అతడి భార్య లక్ష్మి, కుమారుడు బాల కిరణ్, కోడలు కావ్య, మరో కుమారుడు ఉదయ్కిరణ్ ఉన్నారు. గత నెల 29న బాల కిరణ్-కావ్య(Bala Kiran – Kavya) కు వివాహం జరిగింది. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ పెళ్లి జరిగింది. ఈనెల 3న శామీర్పేటలో ఘనంగా రిసెప్షన్ చేశారు. 4న కొత్త దంపతులను తీసుకుని వెంకన్న దర్శనానికి తిరుమల(Tirumala) కు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగడం తీవ్ర విషాదాన్ని నింపింది.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ గురించి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!