Kaleshwaram Project CAG Report in Telangana Assembly
Kaleshwaram project
CM Revanth: కేసీఆర్ పచ్చి అబద్ధం చెప్పారు: రేవంత్ రెడ్డి
CM Revanth Reddy Comments On KCR: కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా కూడా కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదన్నారు. ‘రూ.94 కోట్లు ఖర్చు చేసి నీళ్లు ఇచ్చింది 98, 570 ఎకరాలకు మాత్రమే. కేవలం కరెంటు బిల్లుల కోసమే ప్రతీ ఏడాది రూ.10, 500 కోట్లు ఖర్చవుతోంది. ప్రతీ ఏటా బ్యాంకు రుణాలు, ఇతరత్రా చెల్లింపులకు రూ.25వేల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతుంది.
Also Read: నన్ను చంపుతారా?.. సభలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
నీళ్లు లేవు
ఇప్పటి వరకు అబద్ధపు ప్రచారాలతో కేసీఆర్ కాలం గడిపారు. 2020లోనే ఈ బ్యారేజీకి (Medigadda Barrage) ముప్పు ఉందని అధికారులు ఎల్&టీకి లేఖ రాశారు. సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారు. మూడు బ్యారేజీల్లో ఎక్కడా కూడా నీళ్లు లేవు. నీళ్లు నింపితే కానీ భవిష్యత్లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు ఇష్యూ అవుతుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని’ రేవంత్ ( అన్నారు.
అడ్డగోలుగా స్కామ్ చేశారు
భారతదేశంలో ఇంతపెద్ద స్కామ్ ఏదీ లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అన్నారు. రూ.38 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును (Kaleshwaram Project) 16 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రారంభించిందని అన్నారు. రీఇంజనీరింగ్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేలక కోట్లకు పైగా పెంచేశారని ధ్వజమెత్తారు. వీళ్లు చేసిన పనిని చూస్తే.. తుగ్లక్ కూడా సిగ్గుపడతారని అన్నారు. నీటి నిర్వహణలో బేసిక్ రూల్స్ కూడా పాటించలేదని విమర్శించారు. ఏ వర్క్ చూసినా కూడా అందులో అడ్డగోలుగా స్కామ్లు చేశారంటూ మండిపడ్డారు. ప్రాజెక్టు అవకతవకలపై కేసీఆర్ ఇంతవరకు నోరు మెదపలేదని ఆరోపించారు. ఈ స్కామ్పై క్రిమినల్ ప్రాసెక్యూషన్ చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: బీఎస్పీకి షాక్ ఇచ్చిన యువనేత.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి నీలం మధు!
CBI on Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.48వేల కోట్లు తిన్న మెఘా కృష్ణారెడ్డిపై సీబీఐ విచారణ?
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) అవినీతిపై అవినీతిపై రేవంత్ సర్కార్(Revanth Sarkar) గట్టిగానే ద్రుష్టి పెట్టింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈ చర్యలు చేపట్టింది. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు తనిఖీలు కూడా చేశారు.ఇప్పడు ఈ ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టేందుకు సిద్ధంగాఉన్నామని సిబిఐ కీలక వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం కానీ, కోర్టులు కానీ ఆదేశిస్తేనే దర్యాప్తు
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ(CBI) తో దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సీబీఐ అభిప్రాయాన్నిహైకోర్టు అడిగింది.విచారణకు సిద్ధంగా ఉన్నానని , మానవ వనరులు, మౌలిక సదుపాయాలు కల్పించేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించాలని సీబీఐ అధికారులు కోరారు. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్సెపెక్టర్లు,4 ఎస్సైలతో పాటు సిబ్బంది కావాలని కోరారు.ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశిస్తేనే..దర్యాప్తు చేయగలమని సీబీఐ సీబీఐ కౌంటర్లో పేర్కొంది. అనంతరం పిటిషన్పై విచారణను వచ్చేనెల 2కు కోర్టు వాయిదా వేసింది.
Also Read : Budget 2024-25: బడ్జెట్లో ఉద్యోగులకు వరాల జల్లులు..ఈసారి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా.?
విమర్శల వెల్లువ
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ వంతెన కుంగిపోవడం దుమారం లేపింది. బ్యారేజీలోని బీ బ్లాక్ పరిధిలో గల 18,19, 20, 21 పిల్లర్ల వద్ద బ్ఈయారేజీ వంతెన కుంగింది. మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగడంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కోట్లు ఖర్చుపెట్టామని చెప్పి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మించారని ఆరోపించారు. అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్(BRS Sarkar) పై విమర్శలు చేశారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మేడిగడ్డకు సంబంధించి పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారులు అందజేశారు. ఇటీవలే మంత్రులు కూడా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు.
మెఘా కృష్ణారెడ్డిపై అవినీతి ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మేఘా కంపెనీ(Megha Company) 40 వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని బీజేపీ నేతలతో పాటు ఇతర సంస్థలు ఆరోపిస్తున్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రాజెక్ట్ పై విజిలెన్స్ విచారణ నేపథ్యంలో మెఘా కంపెనీ, దాని ఓనర్ మెఘా కృష్ణారెడ్డి అవినీతి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
ALSO READ : కాంగ్రెస్కి బీజేపీ జాకీలు పెట్టింది.. కేటీఆర్ పంచులు!
Kaleshwaram Project : అన్నారం కంటే మేడిగడ్డలోనే భారీ నష్టం – డీజీ రాజీవ్ రతన్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు తనిఖీలు కొనసాగాయి. పంప్హౌస్లు, బ్యారేజ్ల దగ్గర క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంప్ హౌస్ లోనూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పంప్హౌస్లు నిర్మించిన మేఘాలోనూ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీ రాజీవ్ రతన్ మాట్లాడుతూ అన్నారం కంటే మేడిగడ్డ బ్యారేజ్లోనే భారీ నష్టం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనపై త్వరలో నివేదిక ఇస్తామని వెల్లడించారు. అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీని పోల్చి చూశామని.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన పూర్తి రికార్డులను హార్డ్ డిస్క్లను వారం రోజుల క్రితమే తమ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మళ్లీ తాము క్షేత్ర పరిశీలనకు రావడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోని లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకొంటుందని స్పష్టం చేశారు.
Kaleshwaram Project: రూ.50 వేల కోట్లను కొట్టేసిన మేఘా.. ఆ రూ.500 కోట్ల ఖర్చును ఎలా తప్పించుకుంది?
కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజల సొమ్ము మేఘా కృష్ణారెడ్డి పాలైందని నిత్యం విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట వేల కోట్లు దోచుకున్న మేఘా సంస్థ చేసిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్(Kaleshwaram Lift Irrigation Projet) ప్రాజెక్టులోనే ప్రభుత్వ సహకారంతో మేఘా కృష్ణారెడ్డి వేల కోట్ల ప్రజాసొమ్మును దోచుకున్నారన్న ఆరోపణలు బలపడేలా అనేక వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL)(Megha engineering and infrastructures) దాదాపు రూ.50 వేల కోట్ల అవినీతి సొమ్మును తన జేబులో వేసుకుందని ఇప్పటికే అనేక సార్లు స్పష్టమవగా.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్(కెఎల్ఐఎస్) కింద మూడు బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఉన్న విషయం తెలిసిందే. 2019 వరదల సమయంలో ఈ బ్యారేజీలు దెబ్బతిన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహస్యంగా మరమ్మతు వ్యయాన్ని భరించినట్టు సమాచారం. ఈ అంచనా విలువ రూ. 500 కోట్లు. నిబంధనల ప్రకారం ఈ ఖర్చు భరించేందుకు మేఘా సంస్థ అందుకు నిరాకరించిందా? లేకపోతే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఖర్చును ఎందుకు భరించాల్సి వచ్చింది? అన్న ప్రశ్న తలెత్తుతోంది. నాటి ప్రభుత్వ పెద్దలను, అధికారులను మేనేజ్ చేసి మేఘా సంస్థ ఈ డబ్బులను మింగిందని ఈ విషయం పరిశీలిస్తే స్పష్టం అవుతోంది.
ఖర్చు ఎవరు భరించాలి?
నవంబర్ 2019, వరదల తరువాత, బ్యారేజీల దిగువన ఉన్నసీసీ కర్టెన్ వాల్స్, సీసీ బ్లాక్లు తో పాటు మరొకొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయినట్లు కనుగొన్నారు. మేడిగడ్డ వద్ద రూ.83 కోట్లు, అన్నారం వద్ద రూ.65 కోట్లు, సుందిళ్ల వద్ద రూ.32 కోట్లు నష్టం వాటిల్లిందని అప్పటి ప్రభుత్వం రూ.180 కోట్లు ఖర్చు చేసింది. మరమ్మతులకు రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. నిర్మాణ పనుల్లో లోపాల కారణంగానే ఈ నష్టం జరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
అబద్ధం చెప్పారా?
గత అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలో పైర్లు మునగడం సాధారణ పరిణామమని, ఆ తర్వాత కూడా అప్పటి మంత్రులు కేటీఆర్,హరీష్రావులు రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులకు రూపాయి ఖర్చు చేయదని హామీ ఇవ్వడం విడ్డూరంగా అనిపిస్తోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. 2019లో మూడు బ్యారేజీలకు వరద నష్టాన్ని కప్పిపుచ్చుతూ, అక్టోబర్లో జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కాంట్రాక్టు ఏజెన్సీలే ఖర్చును భరిస్తాయని వారు చాలాసార్లు బహిరంగంగా ప్రకటించారు.
అధ్యయనం చేయలేదు:
కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీ మునిగిపోవడానికి గల కారణాలను కనుగొనడానికి అధ్యయనాల అంచనా వ్యయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఇక వివరణాత్మక అధ్యయనాలు నిర్వహించకుండా 50 టీఎంసీ ft (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగులు) నిల్వ సామర్థ్యంతో KLIS కింద అతిపెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్నసాగర్ను నిర్మించడం ఘోర తప్పిదాన్ని కాగ్ ఎత్తి చూపింది. అవసరమైన పరిశోధనలు, అధ్యయనాలు నిర్వహించకుండా అనవసరమైన హడావిడిగా రిజర్వాయర్ను నిర్మించారని పేర్కొంది.
Also Read: గ్రౌండ్లో విషాదం.. తలకు బాల్ తగిలి క్రికెటర్ మృతి!
WATCH:
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్.. అమిత్ షాతో భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ?
CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం మద్దతు కొరకు ఆయన కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రేవంత్ భేటీ అయ్యారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తో భేటీ కానున్నారు. సీఎం రేవంత్ అమిత్ షాను కలవడంపై అనేక చర్చలకు దారి తీసింది. కాంగ్రెస్ ఏఐసీసీ (AICC) కమిటీ సమావేశంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల కేటాయింపుపై హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం.
ALSO READ: తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్
అమిత్ షాతో.. భేటీ టార్గెట్ కేసీఆర్?
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. రేవంత్ అమిత్ షాను కలవడంపై అనేక ఊహాగానాలు తెరమీదకు వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపించేందుకే రేవంత్ అమిత్ షా కలుస్తున్నారని వార్తలు చలామణి అవుతున్నాయి. మరోవైపు సీఎం కాళేశ్వరంపై (Kaleshwaram Project) సీబీఐ ఎంక్వైరీ కోరతారా?.. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కోరతారా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.ఇప్పటికే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీకి (CBI Enquiry) సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయాలని తెలంగాణ బీజేపీ నేతల అంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడుతామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షా తో ఏమి మాట్లాడుతారనే ఉత్కంఠ నెలకొంది.
ALSO READ: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!
జలశక్తి శాఖ మంత్రితో..
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ కానున్నారు. జలశక్తిమంత్రిని కలిసి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడగనున్నట్లు తెలుస్తోంది. గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసిన సీఎం రేవంత్ తెలంగాణలో గృహనిర్మాణాలకు సహకారం కోరారు.