KCR : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు(Kaleshwaram Project) సంబంధించి వివిధ బ్యారేజ్ ల నిర్మాణాల్లో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) కుంగడం తదితర అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్ర గోష్(Chandra Gosh) కమిషన్ పని ప్రారంభించింది. ఈ రోజు జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరం అయితే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ను పలిచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పలు సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఇంకా ప్రజల నుంచి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇస్తామని ప్రకటించారు. తద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరణ చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో మే 13న సెలవు.. సీఈవో కీలక ప్రకటన..!
Kaleshwaram Project : కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ సంచలన ప్రకటన
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు, బ్యారేజ్ కు సంబంధిందిన వివరాలకు సేకరించేందుకు అవసరం అయితే మాజీ సీఎం కేసీఆర్ ను విచారిస్తామని జస్టీస్ చంద్రఘోష్ సంచలన ప్రకటన చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రారంభించింది.
Translate this News: