BRS Leaders to Visit Kaleshwaram Project: ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం వెళ్లనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ నుంచి నేరుగా కాళేశ్వరం బయలుదేరనున్నారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మొదటగా ఈరోజు సాయంత్రం కరీంనగర్ LMD రిజర్వాయర్ సందర్శిస్తారు. రాత్రి రామగుండంలో బస చేయనున్నారు. రేపు 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్ సందర్శించి.. 11 గంటలకు మేడిగడ్డ సందర్శించనున్నారు.
Kaleshwaram project
CM Revanth : కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యంతర నివేదికపై చర్చ.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (National Dam Safety Authority) ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఏమేం సిఫారసులున్నాయనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరా తీశారు. అలాగే ప్రభుత్వం చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించారు. శనివారం సాయంత్రం సచివాలయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also read: తెలంగాణ కేబినెట్ విస్తరణ.. కొత్త మంత్రులు ఎవరంటే?
కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ (Medigadda) కుంగిపోవటం, సుందిళ్ల బ్యారేజీకి బుంగలు పడటంతో తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలపై ఇటీవల ఎన్డీఎస్ఏ రాష్ట్ర సర్కార్కు మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఉన్న కీలక అంశాలు, సిఫార్సులన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. 2019లోనే బ్యారేజీలకు ప్రమాదం ఉన్నట్లు తేలిందని, రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పు ఉండదని తోసిపుచ్చలేమని ఎన్డీఎస్ఏ నివేదకలో స్పష్టం చేసిందని తెలిపారు.
అయితే మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈలోగా తీసుకోవాల్సిన చర్యలపై కేబినేట్ మీటింగ్లో చర్చించాల్సి ఉంటుందని సీఎం రేవంత్ అన్నారు. రిపేర్లు చేయాలా.. ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా.. మరింత నష్టం జరగకుండా ఏమేం చర్యలు చేపట్టాలనేది ఇరిగేషన్ విభాగం అధికారులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈసీ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల శనివారం జరగాల్సిన కేబినేట్ భేటీ వాయిదా పడటంతో కీలకమైన అంశాలపై చర్చించలేకపోయామని సీఎం అన్నారు. త్వరలోనే మేడిగడ్డ, సుందిళ్ల, అక్కడి పంప్ హౌస్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం లోపు ఈసీ కేబినెట్ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వకపోతే.. మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి సీఈసీని అనుమతి కోరుతామని చెప్పారు.
Also read: రేవంత్ కు నన్ను ఓడించే సీన్ లేదు.. వంశీచంద్ ఓ చిల్లరోడు: డీకే అరుణ బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ
Kishan Reddy: కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సిద్ధం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
T-BJP Chief Kishan Reddy: తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోసారి కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్నది అసత్య ప్రచారం అని ఫైర్ అయ్యారు. ప్రజల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ ఇలాంటి ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏమి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కిషన్ రెడ్డి.
ALSO READ: ఈ నెల 6న తెలంగాణకు ప్రియాంక గాంధీ
తెలంగాణకు గత పదేళ్లు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చిందో చెప్పేందుకు తాము చర్చకు సిద్ధం అని అన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. అక్కడి ఐరన్ఓర్ స్టీల్ ఉత్పత్తికి సరిపోదని అన్నారు. అలాగే ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ను బీజేపీ అమ్మాలని చూస్తోందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మే పరిస్థితి లేదని అన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులకు నిధులు ఇస్తాం అని హామీ ఇచ్చారు. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.
Kaleshwaram Project : కాళేశ్వరంపై కేసీఆర్ ను కూడా విచారిస్తాం.. జస్టిస్ చంద్ర ఘోష్ సంచలన ప్రకటన
KCR : కాళేశ్వరం ప్రాజెక్ట్ కు(Kaleshwaram Project) సంబంధించి వివిధ బ్యారేజ్ ల నిర్మాణాల్లో అవకతవకలు, మేడిగడ్డ బ్యారేజ్(Medigadda Barrage) కుంగడం తదితర అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్ర గోష్(Chandra Gosh) కమిషన్ పని ప్రారంభించింది. ఈ రోజు జస్టిస్ చంద్ర ఘోష్ విచారణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరం అయితే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్ ను పలిచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పలు సమాచారం సేకరిస్తామని చెప్పారు. ఇంకా ప్రజల నుంచి కూడా ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇస్తామని ప్రకటించారు. తద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరణ చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో మే 13న సెలవు.. సీఈవో కీలక ప్రకటన..!
నిపుణుల అభిప్రాయాలను తీసుకొని విచారణ మొదలు పెడతామన్నారు జస్టిస్ చంద్రఘోష్. ఇంకా ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ ఇచ్చిన నివేదికలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన ఇంజనీర్లతోనూ భేటీ అవుతామన్నారు. తమ విచారణలో సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. లీగల్ అంశాల ఆధారంగానే తమ ఎంక్వైరీ జరగనున్నట్లు తెలిపారు చంద్రఘోష్. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులతో చంద్రఘోష్ సమావేశం అయ్యారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత, పిల్లర్ల కుంగడంపై పలు విషయాలను ఇంజనీర్లను అడిగి వివరాలను సేకరించారు. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుందని.. దాంతోపాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్ చంద్ర గోష్ పేర్కొన్నారు. విచారణ క్రమంలో నిర్మాణ సంస్థలకు.. ఇంకా అవసరమైతే పొలిటికల్ లీడర్లకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తమ రెండో పర్యటనలో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లి పరిశీలిస్తామన్నారు.
Uttam Kumar Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఉత్తమ్
Minister Uttam Kumar Reddy: నీటి పారుదల రంగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశ పెట్టారు. అనంతరం ఆయన సభలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మించిన స్థలం సరికాదని అన్నారు. వైట్పేపర్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఇచ్చిన నివేదికను పొందుపరిచినట్లు తెలిపారు. డిజైన్, నిర్మాణ లోపాలు, పర్యవేక్షణ లోపం వల్లే మేడిగడ్డ కుంగిందని అన్నారు. రాఫ్ట్ కుంగడంతో పియర్స్కు కూడా కుంగిపోయాయని తెలిపారు.
ALSO READ: ప్రమాదంలో అన్నారం బ్యారేజ్.. నీళ్లు లీక్!
మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదు..
మేడిగడ్డలోని ఏడో బ్లాక్లో పియర్స్కు నిట్టనిలువునా చీలిక వచ్చిందని అన్నారు. ఏడో బ్లాక్లో 20వ పియర్ పూర్తిగా కుంగిపోయిందని పేర్కొన్నారు. 21 నుంచి 16వ పియర్ వరకు పారాపెట్ గోడ కుంగిపోయిందని అన్నారు. బ్యారెజ్ కట్టిన తర్వాత ఎలాంటి తనిఖీలు, మెయింటెనెన్స్ చేయలేదని అన్నారు. 2022లో వరదల కారణంగా అన్నారం, కన్నెపల్లి పంపుహౌస్లు మునిగాయని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కూడా ప్రమాదంలో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
90 శాతం ఫెయిల్
అగ్రిమెంట్ ప్రకారం ఎల్ అండ్ టీ నిర్మాణ పనులు పూర్తి చేయలేదని మండిపడ్డారు. పనులు కానప్పటికీ ఏజెన్సీకి నిధులు విడుదల చేయాలని రామగుండం ENC లేఖ. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ. 93 వేల 872 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని ప్లాన్ అని.. నిర్దేశించిన టార్గెట్ను చేరుకోవడంలో ప్రాజెక్టు 90 శాతం ఫెయిల్ అయిందని పేర్కొన్నారు.
ఏపీకి ఎక్కువ..
కాళేశ్వరం ద్వారా 98 వేల 890 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో ఎత్తిపోసిన నీళ్లన్ని సముద్రం పాలయ్యాయని అన్నారు. అంటే నీటిని ఎత్తిపోసేందుకు అయిన ఖర్చు మొత్తమంతా వృథానే అని అన్నారు. ఏపీ అధిక నీటి వినియోగాన్ని అడ్డుకోవడంలో గత ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. గత ఐదేళ్లలో ఏపీ 100 టీఎంసీలు అధికంగా ఉపయోగించుకుందని వెల్లడించారు.
ALSO READ: కాంగ్రెస్లోకి ఈటల రాజేందర్.. ముఖ్యనేతలతో భేటీ!
DO WATCH:
Revanth Reddy : ఆ ఆలోచనే కేసీఆర్దే.. మేడిగడ్డ విషయంలో తప్పంతా వారిదే : రేవంత్రెడ్డి
Revanth Reddy Slams KCR in Assembly : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) మధ్య వాటర్ వార్ అంతకంతకూ ముదురుతోంది. మేడిగడ్డ ప్రాజెక్టు(Medigadda Project) విషయంపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకరినొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచనే కేసీఆర్(KCR) దేనని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని ఇంజనీర్లకు సూచించింది కూడా కేసీఆరేనని మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ కమిటీ ఏర్పాటు చేశారని.. ఆ కమిటీ సాగునిటి ప్రాజెక్టులపై ఓ రిపోర్టును ఇచ్చిందన్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగమని ఇంజినీర్లు తేల్చారని.. ఐదుగురు ఇంజినీర్ల బృందం స్పష్టంగా చెప్పిన విషయం ఇదేనన్నారు. గత ప్రభుత్వం ఈ రిపోర్ట్ ను తొక్కి పెట్టిందని ఫైర్ అయ్యారు.
రేవంత్రెడ్డి ఏం అన్నారంటే?
–> గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది.
–> ప్రాజెక్టులపై వాస్తవాలను సభ ముందు పెట్టే ప్రయత్నం ఉత్తమ్ చేశారు.
–> తప్పులతడక అంటూ హరీశ్రావు(Harish Rao) తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
–> పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు?
–> పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే.
–> తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలో మునిగిపోయేది 1850 ఎకరాలే.
–>తుమ్మిడిహట్టి దగ్గరే కడితే మంచిదని ఇంజినీర్లు సిఫార్సు చేశారు.
–> 151 మీటర్లతో ప్రాజెక్టు నిర్మించాలని పదేపదే చెప్పారు.
–> ఇప్పటికైనా తప్పులు ఒప్పుకోండి.. కప్పిపుచ్చుకోండి.
ఎంతో ద్రోహం చేశారు:
తెలంగాణ ఖాజానాను కొల్లగొట్టేందుకు ఇంత దుర్మార్గానికి తెగపడ్డారంటూ మేడిగడ్డ విషయంలో కేసీఆర్, హరీశ్రావుపై రేవంత్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ , హరీష్ కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారని.. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని కాదు… కాళేశ్వరం తెలంగాణకు ఒక కళంకంగా మిగిలిపోయిందని ఆరోపించారు. క్షమాపణలు చెప్పాల్సిందిపోయి.. నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అని నిలదీశారు రేవంత్. ప్రాజెక్టులు పగిలిపోతుంటే క్షమాపణలు చెప్పకుండా.. ఇంకా వాదిస్తారా అని ప్రశ్నించారు. ఈ పాపాలకు మామా అల్లుళ్లు కారణం కాదా అంటూ రెచ్చిపోయారు రేవంత్. ఇలాంటి పరిస్థితుల్లో మొండి వాదనలు… తొండి వాదనలు వద్దు అంటూ హరీశ్రావుకు చురకలంటించారు. మీరు నియమించిన అధికారుల నివేదికనే మీరు తప్పు పడతారా అని క్వశ్చన్ చేశారు రేవంత్. ఆనాడు దీక్షలు, ధర్నాలు చేసిన సబితక్క.. ఈనాడు హరీష్ రావుని సమర్ధిస్తున్నారా అని ఎద్దెవా చేశారు.
Also Read: అసెంబ్లీలో హరీశ్ నోట గద్దర్, అందెశ్రీ పాట.. వీడియో వైరల్!