Jaya Lalitha: తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జయలలిత మరణంపై సీబీఐ విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టులో న్యాయవాది రాంకుమార్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది.
jayalalitha
Kejriwal: సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్!
ఢిల్లీ మద్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (Kejriwal) ను గురువారం సాయంత్రం ఈడీ (ED) అధికారులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాలే. అయితే దేశంలో మరి కొందరు ముఖ్యమంత్రులు పదవి నుంచి వైదొలిగిన తరువాత అరెస్ట్ అయ్యారు.
వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మొదలు.. నిన్న కాక మొన్న అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వరకు ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్(బీహార్)
బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆయన పదవిలో ఉన్న సమయంలో దాణా కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన పదవి నుంచి తప్పుకున్న తరువాత లాలూ యాదవ్ తో పాటు.. మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాలను కూడా కోర్టు దోషులుగా పేర్కొంది. ఈ క్రమంలో అరెస్ట్ అయిన లాలూ.. తరువాత బెయిల్ పై విడుదల అయ్యారు.
జయలలిత (తమిళనాడు)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్రంలో కలర్ టీవీల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన కేసులో అరెస్టయ్యారు. అప్పుడు ఆమె నెలరోజులు జైలులో ఉండగా… ఆ తరువాత ఆమె విడుదల అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె 2014లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరోసారి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు.
హేమంత్ సోరెన్ (జార్ఖండ్)
జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) నాయకుడు హేమంత్ సోరెన్ను జనవరి 31న ఇడి తన రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణంపై మనీలాండరింగ్ విచారణకు సంబంధించి అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు సోరెన్ తన పదవికి రాజీనామా చేయడంతో పార్టీ సీనియర్ మంత్రి చంపాయ్ సోరెన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.
మధు కోడా (జార్ఖండ్)
2006 నుండి 2008 వరకు జార్ఖండ్ రాష్ట్రాన్ని నడిపిన అతి పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రి మధు కోడా. కోడా సీఎంగా ఉన్న సమయంలో బొగ్గు, మైనింగ్ బ్లాకుల కేటాయింపుల కోసం లంచాలు అందుకున్నారని ఈడీ, సీబీఐ ఆరోపించి ఆయనను అరెస్ట్ చేశాయి.
చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతేడాది అరెస్టయ్యారు. ఆయన సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కోట్లాది రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈ అరెస్టు జరిగింది.
ఓం ప్రకాష్ చౌతాలా (హర్యానా)
హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాలా పలుమార్లు పని చేశారు. ఈ క్రమంలో ఆయన ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు దోషిగా తేలడంతో పదేళ్ల శిక్ష, ఆ తరువాత అక్రమాస్తుల కేసులో మరో నాలుగేళ్లు శిక్ష పడింది.
Also read: ఈడీ, సీబీఐ బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయి…కేజ్రీవాల్ అరెస్ట్ పై కేటీఆర్!
Jayalalitha: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!
Jayalalitha Gold & Assets Auction: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబందించిన నగలు, స్థిరాస్తులను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో జరిమానా చెల్లించేందుకు ఆమె 28 కిలోల బంగారు నగలను అమ్మకానికి పెట్టనున్నారు. ఈ మేరకు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు (Bangalore Court) జయలలితకు 4ఏళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు 4ఏళ్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది.
ఆస్తులు అమ్మి జరిమానా..
అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసు విచారించిన న్యాయస్థానం నలుగురిని విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే అనంతరం కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ విచారణ సమయంలో 2016 డిసెంబరు 5న జయలలిత చనిపోయారు. దీంతో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుని సమర్థించగా.. జయలలిత మరణించి 6ఏళ్లు గడిచినా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి : Liquor Scam : కవితకు మరో బిగ్ షాక్.. న్యాయవిచారణకు దిగిన సీబీఐ!?
కేసు ఖర్చుగా రూ.5 కోట్లు..
ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో అవినీతి నిరోధకశాఖ (ACB) స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి నగలు, వజ్రాల నగలను కోర్టుకు అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించేందుకు నిర్ణయించారు.ఆ మేరకు నగలను మార్చి 6, 7 తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటిని ప్రభుత్వ ఖజానాలో ఉంచి, ఆ తర్వాత వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే రూ.40 కోట్లు వరకు ధర పలకనుండగా.. మిగిలిన రూ.60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయనున్నారు. కేసు ఖర్చుగా రూ.5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి ఇవ్వాల్సివుండగా.. జయలలిత (Jayalalitha) పూర్తి ఆస్తులను అమ్మేసి ఫీజు చెల్లించనున్నారు.
Tamil Nadu:జయలలిత బంగారం ఇచ్చేస్తాం..ఆరు ట్రంకు పెట్టెలు పట్టుకురండి
Bengaluru court:తమిళనాడు మాజీ సీఎం, సినీ నటి దివంగత జయలలితను దోషిగా తేలుస్తూ బెంగళూరు కోర్టు శిక్ష విధించింది. భారీ జరిమానాతో పాటూ 4 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ శిక్ణు అనుభవిస్తూనే జయలలిత చనిపోయారు. అయితే ఆమెకు విధించిన భారీ జరిమానా మాత్రం ఇంకా కట్టకుండా ఉండిపోయింది. ఇప్పుడు ఆ భారీ జరిమానాను కూడా వసూలు చేసుకోవాలని డిసైడ్ అయింది బెంగళూరు కోర్టు. ఈ నేపథ్యంలో జయలలిత బంగారాన్ని తీసుకెళ్ళాలని తమిళనాడు ప్రభుత్వానికి చెప్పింది.
Also Read:Hyderabad: కుమారి ఆంటీ డైలాగ్స్ ఫాలో అవుతున్న హైదరాబాద్ పోలీసులు
6 ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి..
అక్రమాస్తుల కేసులో 2014లో అప్పడు తమిళనాడుకు సీఎంగా ఉన్న జయలలితను దోషిగా తేల్చుకుంది బెంగళూరు కోర్టు. అప్పుడే ఆమెకు శిక్షలను కూడా వేసింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తుండగా జయలలిత చనిపోయారు. దీంతో బెంగళూరు కోర్టు ఆమె దగ్గర ఉన్న బంగారం, వెండి, ఆభరణాలు, ఖరీదైన వస్తువులు అన్నీ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు వాటిని తీసుకెళ్ళడానికే రమ్మని తమిళనాడు ప్రభుత్వానికి కబురు పెట్టింది బెంగళూరు కోర్టు. ఈ వస్తువులన్నింటితో పాటూ జయలలిత స్థిరచరాస్థులన్నింటినీ వేలం వేయడం లేదా అమ్మడం ద్వారా జరిమానా రాబట్టుకోవాలని భావిస్తోంది. ఇందులో జయలలితవి 27 కిలోల బంగారం, వెండి, ఇతర వజ్రాభరణాలు ఉన్నాయి. ఇవి పట్టుకెళ్ళాలంటే ఆరు ట్రంకు పెట్టెలైనా కావాలని కోర్టు చెప్పినట్టు తెలుస్తోంది. వీటిని వచ్చే నెల ఆరు, ఏడు తేదీల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించనున్నట్లు కోర్టు తెలిపింది. ముందు ఈ అభరణాలు వేలం వేసిన తర్వాత జయలలిత స్థిరాస్తులను కూడా వేలంలోకి తీసుకురానుంది.
కవిత ఢిల్లీ టూర్… షీ ద లీడర్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ….!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రముఖ నేషనల్ జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షీ ద లీడర్’అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు. పలువురు జాతీయ స్థాయి నేతలతో కలిసి ఆమె వేదికను పంచుకున్నారు. ఈ సందర్బంగా నిధి శర్మ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. స్వ రాష్ట్ర స్వప్పం సాకారమవుతుందని తాము అనుకోలేదన్నారు. తన తండి సీఎం అవుతారని తాము ముందు ఊహించలేదన్నారు.
కఠినమైన మార్గంలో ఎన్నో కష్టాలను అధిగమించి ప్రస్తుతం తాను ఈ స్థానానికి చేరుకున్నానని వెల్లడించారు. ప్రతి రంగంలోనూ మహిళలకు పరిమితులు వుండటం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. రాజకీయాలు అనేవి కొందరి కోసం వున్నవి కాదన్నారు. అవి మన అందరి కోసం వున్నాయని చెప్పారు. రాజకీయాలు అంటే సమయాన్ని వృథా చేయడమని అంతా అనుకుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి చెందుతుందన్నారు.
‘షీ ద లీడర్’అనే పుస్తకంలో మొత్తం 17 మంది ప్రముఖ మహిళా రాజకీయ నేతల వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. సామాజిక సమానత్వం, మహిళా అభ్యున్నతితో పాటు ఇతర రంగాల్లో విశేషంగా కృషి చేసిన ప్రముఖ నేతల వివరాలను ఇందులో రాశారు. పుస్తకంలో ప్రముఖ మహిళా నేతలు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ సీఎం సుచేత కృపాలని గురించి పుస్తకంలో రాశారు.
వారితో పాటు తమిళనాడు మాజీ సీఎం జయలలిత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సిందియా , ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి షీలా దీక్షిత్, యూపీ మాజీ సీఎం మాయావతి, ప్రతిభా పాటిల్, సుష్మా స్వరాజ్ ,బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బృందాకరత్ ,అంబికా సోనీ ,స్మృతి ఇరానీ, సుప్రియ సులే , కనిమొళిల జీవిత విశేషాలను పుస్తకంలో ప్రస్తావించారు.