Jayalalitha Gold & Assets Auction: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబందించిన నగలు, స్థిరాస్తులను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో జరిమానా చెల్లించేందుకు ఆమె 28 కిలోల బంగారు నగలను అమ్మకానికి పెట్టనున్నారు. ఈ మేరకు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు (Bangalore Court) జయలలితకు 4ఏళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు 4ఏళ్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది.
పూర్తిగా చదవండి..Jayalalitha: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!
దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన నగలు, స్థిరాస్తులను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో జరిమానా చెల్లించేందుకు 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, వజ్రాల నగలను అమ్మకానికి పెట్టనున్నారు. రూ.60 కోట్ల స్థిరాస్తులను అమ్మేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
Translate this News: