Suryapet: గురుకుల పాఠశాలలో విషాదం..ఐదో తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి!

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెన్ పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి (10) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని ఆ లోపే బాలిక చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు.

Suryapet: గురుకుల పాఠశాలలో విషాదం..ఐదో తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి!
New Update

Suryapet: సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెన్ పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థిని సరస్వతి (10) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నూతనకల్ మండలం మాచన పల్లి గ్రామానికి చెందిన సోమయ్య నవ్య దంపతుల కూతురు సరస్వతి బీసీ వెల్ఫేర్ దోసపాడు గురుకుల పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది.

మంగళవారం ఉదయం తీవ్ర జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించామని ఆ లోపే బాలిక చనిపోయిందని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. మరో వైపు జ్వరం వచ్చిందని మంగళవారం ఉదయం ఏడు గంటలకు తమకు సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు చెప్పారు. అయితే హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం విద్యార్థిని మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also read: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు…హోం మినిస్టర్‌ తో భేటీ!

#gurukula-patasala #student #suryapet #nalgonda #crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి