Harish Rao : తెలంగాణలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి : హరీష్ రావు

TG: రాష్ట్రంలో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నిన్న వరంగల్‌లో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు.

New Update
MLA Harish Rao: పవర్‌ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్

Street Dogs Attack : తెలంగాణ (Telangana) లో వీధికుక్కల దాడులు విపరీతంగా పెరిగాయని అన్నారు బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao). ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని అన్నారు. నిన్న వరంగల్ (Warangal) లో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయని చెప్పారు. నార్సింగిలో దివ్యాంగ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేశాయని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో కుక్కలదాడిలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయిందని అన్నారు. 8నెలల కాలంలో 343 కుక్కకాటు ఘటనలు జరిగాయని చెప్పారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : ప్రకంపనలు సృష్టిస్తోన్న RTV కథనాలు.. Euro Exim Bankపై ఆర్థిక శాఖకు లేఖ!

Advertisment
తాజా కథనాలు