తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఓ చట్టాన్ని అమలుచేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. అప్పులు తీసుకునే రైతులపై అధిక వడ్డీ భారం పడకుండా అడ్డుకునేందుకు ‘తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్’ను అమలు చేయనుంది. దీని ప్రకారం వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను 9 శాతం వరకే పరిమితం చేయాలని భావిస్తోంది. ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లైతే.. రుణ దాతలందరూ కూడా క్రమం తప్పకుండా తమ లైసెన్స్లను పునరుద్దరించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేవలం 30 శాతం రైతులు మాత్రమే సంస్థాగత ఫైనాన్సింగ్ (బ్యాంకుల నుంచి రుణాలు) పొందడానికి అర్హులయ్యారు. మిగతా రైతులందరూ రుణాల కోసం ప్రైవేట్ రుణ దాతలపై ఆధారపడుతున్నారు. ఇందుకోసం వాళ్లకి 48 శాతం వరకు వడ్డీ కడుతున్నారు. దీంతో రైతులకు వడ్డీ కట్టడం పెను భారంగా మారింది.
పూర్తిగా చదవండి..Telangana: రైతులకు ఇక వడ్డీ భారం ఉండదు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం !
త్వరలో 'తెలంగాణ మనీ లెండర్స్ యాక్ట్'ను అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీని ప్రకారం వ్యవసాయ రుణాలపై వడ్డీ రేట్లను 9 శాతం వరకే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల అప్పులు తీసుకునే రైతులకు వడ్డీ భారం తగ్గనుంది.
Translate this News: