Breaking : జక్కన్న కు తప్పిన పెను ప్రమాదం!

రాజమౌళి పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జపాన్‌ భూకంపం నుంచి తృటిలో తప్పించుకున్నామని ఆయన కుమారుడు కార్తీకేయ తెలిపారు. తాము ఓ బిల్డింగ్‌ లో 28 వ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విటర్‌ లో పేర్కొన్నారు.

Rajamouli : జక్కన్న దంపతులకు ఆస్కార్ అకాడమీ నుంచి అరుదైన ఆహ్వానం!
New Update

Jakkanna : తెలుగు దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కి(SS Rajamouli) పెను ప్రమాదం తప్పింది. ఆర్‌ఆర్‌ఆర్‌(RRR) సినిమాతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ట్రిపుల్ ఆర్‌ సినిమా వచ్చి మూడు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాను జపాన్‌(Japan) లో విడుదల చేయగా సక్సెస్‌ఫుల్‌ గా ఏడాదిన్నర గా థియేటర్లలో రన్‌ అవుతుంది.

ఈ క్రమంలోనే అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ షోలో పాల్గొనేందుకు వెళ్లారు. అక్కడ రాజమౌళి పెను ప్రమాదం(Accident) నుంచి తప్పించుకున్నారు. అక్కడ భూకంపం(Earthquake) బారి నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు కార్తీకేయ తెలిపారు. తాము ఓ బిల్డింగ్‌ లో 28 వ అంతస్తులో ఉన్న సమయంలో మెల్లగా భూమి కంపించడం మొదలైందని ట్విటర్‌ లో పేర్కొన్నారు.

జపాన్‌ లో భూకంపం ఎలా ఉంటుందో అనేది మేం ఇప్పుడే చూశాం అంటూ కార్తికేయ(Karthikeya) చెప్పుకొచ్చాడు. మేం టెన్షన్‌ పడ్డాం కానీ, జపనీయులు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్నారు. వారంతా ఏదో వానజల్లు పడుతున్నంత తెలికగా తీసుకున్నారు... మేము మాత్రం మొత్తానికి భూకంపాన్ని ఎక్స్‌పీరియెన్స్‌ చేశామంటూ కార్తికేయ ట్విటర్‌(X) లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. ఏమి కాలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం జక్కన్న మహేష్‌ బాబు తో ఎస్‌ఎస్ ఎంబీ 29 సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం సినిమాకి సంబంధించిన రైటింగ్‌ పనులు పూర్తయినట్లు ఆయన తెలిపారు.

Also Read : ఏపీ ఈఏపీసెట్‌ వాయిదా!

#ss-rajamouli #karthikeya #earthquake #japan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe