/rtv/media/media_files/2025/06/06/fzIhTnfoYViKAm4A5cYc.jpg)
preity zinta emotional first post on pbks final runner up
ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అడుగు దూరంలో ట్రోఫీని చేజార్చుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ IPL 2025 సీజన్లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ అందరి చేత ప్రసంసలు అందుకుంది.
ఈ సీజన్ అనుకున్నట్లుగా ముగియలేదు
మొదటి నుంచి టేబుల్ టాపర్గా నిలిచి ఫైనల్కు చేరుకుంది. కానీ తృటిలో కప్ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆ టీం కో-ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటా తొలిసారి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఈ ఐపీఎల్ సీజన్ తాము అనుకున్నట్లుగా ముగియలేదని అన్నారు. కానీ ఈ జర్నీ మాత్రం అద్భుతం అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాకుండా తమ యువ జట్టు ధైర్యం, పోరాటం అందరికీ ఎంతో నచ్చిందని అన్నారు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
ఈ ప్రయాణం తాము అనుకున్నట్లు అస్సలు జరగలేదని తెలిపారు. కాని ఇది ఎంతో అద్భుతంగా ఉందని.. ఎంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు. తమ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టీంను నడిపించిన తీరు చాలా బాగుందని అన్నారు. అదే సమయంలో ఈ ఐపీఎల్ అన్క్యాప్డ్ ప్లేయర్ల ప్రదర్శన అద్భుతంగా ఉందన్నారు.
ముఖ్యంగా ఈ సీజన్లో తమ జట్టు ఆటగాళ్లకు బాగా గాయాలు అయ్యాయని.. ఇతర కారణాలతో కూడా కీలక ఆటగాళ్లు దూరమయ్యారని తెలిపారు. అది మాత్రమే కాకుండా ఈ సీజన్ ఐపీఎల్కు ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. దాని వల్ల స్వరాష్ట్రంలో జరగాల్సిన మ్యాచ్లు ఇతర రాష్ట్రాల్లో జరిగాయని.. అలాంటి పరిస్థితుల్లో కూడా రికార్డులు బద్దలుకొట్టామని ప్రశంసించారు.
Also Read : వాయు కాలుష్యంతో అనేక ప్రమాదాలు.. తెలుసుకుంటే షాక్ అవుతారు
తమ జట్టు కప్పును ఇంటికి తీసుకెళ్లలేకపోవచ్చు కానీ.. వారందరూ తమ అందరి హృదయాలను గెలుచుకున్నారు అని తెలిపారు. ఆమె ఇన్స్టా పోస్టుపై నెటిజన్లు స్పందించారు. ఈ మేరకు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీ పోస్టు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని అంటున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ చెబుతున్నారు.