/rtv/media/media_files/2025/04/20/UoLNtu70iaZVEHugGxsk.jpg)
MI won The match
ముంబై ఇండియన్స్ ఈ రోజు తన అసలు ఆట ఆడింది. చైన్నై ను చితక్కొట్టింది. తమ సొంత గ్రౌండ్ లో సీఎస్కే ను మట్టి కరిపించింది. రోహిత్, స్కై ద్వయం బ్యాటింగ్ తో పిచ్చెక్కించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి..చెన్నై ఇచ్చిన 177 పరుగులు టార్గెట్ ను అలవోగ్గా ఛేదించేశారు. చెన్నై బౌలర్లు ఎంత ప్రయత్నించినా రోహిత్, సుర్యకుమార్ లను ఆపలేకపోయారు. ఇద్దరు బ్యాటర్లు ఫోర్లు, సిక్స్ లతో చెలరేగిసోయారు. దీంతో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల తేడాతో చెన్నై మీద మ్యాచ్ గెలిచింది. దీంతో ఎమ్ఐకు హ్యాట్రిక్ విజయం లభించింది. మొదట సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్కు దిగిన ముంబయి 15.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (76*), సూర్యకుమార్ యాదవ్ (68*) అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు.
Rohit Sharma (76*) and Suryakumar Yadav (68*) stitch together an unbroken 114-run stand as Mumbai Indians thrash Chennai Super Kings by 9 wickets with more than four overs to spare #IPL2025 #MIvCSK Recap: https://t.co/xNtDdUKjBg pic.twitter.com/0iBcThBo3i
— Firstpost Sports (@FirstpostSports) April 20, 2025
We literally smocked CSK today.
— Snehal Verma (@Snehalsays_03) April 20, 2025
We saw an old skool MI vs CSK match today 👐🏻💙💙💙💙
Best franchise for a reason.#Mumbaiindians #rohitsharma #suryakumar pic.twitter.com/AvrB9AwD2T
చెన్నై బ్యాటర్ల కష్టం వృధా..
ఐపీఎల్లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (50), రవీంద్ర జడేజా (53*) రాణించారు. ధోనీ (4) నిరాశరపరిచాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, మిచెల్ శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో ముంబై ఇండియన్స్ చెన్నైకు 177 పరుగులు టార్గెట్ ఇచ్చింది.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు అశ్వనీ కుమార్ బిగ్ షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే డేంజరస్ ఆటగాడు రచిన్ రవీంద్ర(5)ను ఔట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన ఆయుష్ మాత్రే(32) ఆ ఓవరలో వరుసగా 4, 6, 6 బాది తన తడాఖా చూపించాడు. దాంతో, చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది. ఆ తర్వాత పెద్ద షాట్కు యత్నించి బౌండరీ లైన్ వద్ద శాంట్నర్ చిక్కాడు.
ఆ కాసేపటికే శాంట్నర్ ఓవర్లో షేక్ రషీద్(19) ఫ్రంట్ ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు. దీంతో చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(53 నాటౌట్)తో కలిసి శివం దూబే(50) ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్కు 79 పరుగులు జోడించారు,. జట్టు స్కోర్ 140 దాటాక దూకుడుగా ఆడుతున్న దూబే ఔటయ్యాడు. ధోనీ త్వరగానే ఔట్ అయినప్పటికీ జడేజా జట్టు స్కోరు పెంచుతూ దూకుడుగా ఆడాడు. దీంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
today-latest-news-in-telugu | IPL 2025 | MI vs CSK