/rtv/media/media_files/2025/02/10/1Dfqln8ggHIqOEDB0zkr.jpg)
Rohith Sharma
ఐపీఎల్లో భాగంగా వాంఖేడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మొదటి ఇన్నింగ్స్ను పూర్తి చేసుకుంది. 16.2 ఓవర్లలో 116 పరుగులకు కేకేఆర్ జట్టును ముంబై ఇండియన్స్ జట్టు ఆలౌట్ చేసింది. అయితే ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్లో బోణీ కొట్టాలంటే 117 పరుగులు చేయాలి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ జరుగుతోంది. క్రీజులోకి ర్యాన్ రికెల్టన్, రోహిత్ శర్మ వచ్చారు. అయితే హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోయాడు. ఇలానే ముంబై ఇండియన్స్ ఆడితే.. బోణీ కొట్టేస్తుంది. 2.5 ఓవర్లలో ముంబై జట్టు 28 పరుగులు చేసింది.