MS Dhoni: ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లోకి ధోనీ..ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు..

భారత క్రికెటర్లలో ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక వ్యక్తి ధోనీ. ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ జాబితాలోకి అతడికి చోటు కల్పిస్తూ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏడుగురికి స్థానం ఇవ్వగా ఐదుగురు పురుష క్రికెటర్లు, ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు. 

New Update
Yuvraj, Sehwag, Sachin and Ganguly play together again MS Dhoni (1)

M.S.Dhoni

భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ కు మరో అరుదైర గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు సంపాదించాడు. భారత్ నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక క్రికెటర్ గా ధోని నిలిచాడు. ఐసీసీ హాల్ ఫేమ్ లో మొత్తం ఏడుగురికి స్థానం ఇచ్చారు. అందులో ఐదుగురు పురుష క్రికెటర్లు ఉండగా..ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రేమీ స్మిత్, హషీమ్ అమ్లా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెట్టోరి ఉన్నారు. ఇక మహిళా క్రికెటర్లలో పాక్‌ నుంచి సనా మిర్, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ సారా టేలర్‌ లు ఈ జాబితాలో ఉన్నారు. 

హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను ప్రకటించిన జైషా

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ ఛైర్మన్ జైషా అనౌన్స్ చేశారు. క్రికెట్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన వారిని గౌరవించేలా హాల్‌ ఆఫ్‌ ది ఫేమ్‌లోకి కొత్త సభ్యులను ఆహ్వానిస్తున్నాం అని చెప్పారు. హాల్ ఫేమ్ లో చోటు సంపాదించిన వారందరూ భవిష్యత్తు తరాల వారికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. ఈ సారి అవకాశం దక్కిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు అని రాశారు. 

భారత క్రికెట్ కు ఎం.ఎస్ ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలను అందించాడు. 2007లో టీ20 వరల్డ్ కప్, 28 ఏళ్ళ తరువాత 2011లో వన్డే వరల్డ్ కప్,  తర్వాత రెండేళ్ళకు 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ధోనీ నాయకత్వంలోనే భారత్ సాధించింది. టీమ్‌ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లు కలిపి 538 మ్యాచులు ఆడిన ధోనీ మొత్తం 17,266 పరుగులు చేశాడు. ఇక 829 ఔట్ల (క్యాచ్‌లు, స్టంపింగ్స్‌)లో భాగస్వామిగా ఉన్నాడు. ఐదేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ఇప్పుడు ఐపీఎల్‌లోనే ఆడుతున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు