/rtv/media/media_files/2025/04/30/5s8467tjM0oMRTorMiBn.jpg)
adem dhoni
ఐపీఎల్ 2025 తర్వాత ఎంఎస్ ధోని రిటైర్ కావాలని ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్-బ్యాటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సలహా ఇచ్చాడు. పంజాబ్ కింగ్స్తో చెన్నై మ్యాచ్కు ముందు గిల్క్రిస్ట్ మాట్లాడుతూ.. ధోనీ ఇప్పటికే తాను సాధించాల్సిదంతా సాధించేశాడని చెప్పుకొచ్చాడు. ఆటపరంగా ధోనీ ఇంకా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని అభిప్రాయపడ్డాడు. ఐ లయ్ యూ ధోని నువ్వొక ఛాంపియన్వి. ఐకాన్వి అంటూ కితాబ్ ఇచ్చాడు.
Adam Gilchrist, the former captain of the Deccan Chargers who led the team to victory in the IPL 2009, has expressed his opinion that he believes it would be best for MS Dhoni not to participate in the upcoming IPL season
— DNA (@dna) April 30, 2025
Read here: https://t.co/BRwCVXfirI#DNAUpdates |… pic.twitter.com/ekxrlKsGag
చెన్నై జట్టులో మార్పులు
చెన్నై జట్టులో మార్పులు చేయలన్నాడు గిల్ క్రిస్ట్ . వచ్చే సీజన్కు ముందు జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ధోనీతోపాటు షేక్ రషీద్, డేవాన్ కాన్వే, దీపక్ హుడాలను పక్కనపెట్టాలని సూచించాడు. కాగా ఈ సీజన్ ప్రారంభం కావడానికి ముందు, ధోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన క్రికెట్ జీవితంలోని చివరి కొన్ని సంవత్సరాలను ఆస్వాదించాలనుకుంటున్నానని చెప్పాడు.
ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ గైర్హాజరీలో ధోని ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయినప్పటికీ చెన్నై ఆట తీరు ఏ మాత్రం మారడం లేదు. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడి రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్లో 98 బంతులు ఎదుర్కొన్న ధోనీ.. 140 పరుగులు మాత్రమే చేశాడు.
ms-dhoni | Chennai Super Kings | cricket
Also read : IPL 2025: పంజాబ్ కింగ్స్కు బిగ్ షాక్ ... టోర్నమెంట్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్!