/rtv/media/media_files/2025/03/22/YhCtUbo00r8OV0gJHoUd.jpg)
Virat Kohli
సీనియర్ గా కింగ్ కోహ్లీ ఆర్సీబీ బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నాడు. బ్యటింగ్ కు దిగిన దగ్గర నుంచి బాగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో ఈరోజు మొదటి మ్యాచ్ కేకేఆర్, ఆర్సీబీల మధ్య అవుతోంది. ఇందులో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి 174 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీకి ఇచ్చింది. దీన్ని ఈజీగానే ఛేదిస్తోంది బెంగళూరు జట్టు. ఓపెనర్లుగా వచ్చిన కోహ్లీ, సాల్ట్ లు నిలకడగా ఆడారు. సాల్ట్ 56 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. విరాట్ మాత్రం ఇంకా ఆడుతున్నాడు. ఈక్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
today-latest-news-in-telugu | rcb | ipl-2025 | kkr