IPL 2025 Reschedule Dates: యుద్ధం ముగిసింది.. మరి ఐపీఎల్ సంగతేంటి..?

భారత్-పాక్ యుద్ధం ముగియడంతో బీసీసీఐ ఐపీఎల్ 2025ను తిరిగి ప్రారంభించనుంది. మే 8న రద్దైన పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్ తిరిగి జరగొచ్చని వార్తలు వస్తున్నాయి. ఇరు జట్లకు పాయింట్లు జమ కాకపోవడంతో బీసీసీఐ నిర్ణయంపై అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

New Update
IPL 2025 Reschedule Dates

IPL 2025 Reschedule Dates

IPL 2025 Reschedule Dates: భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు(India Pakistan War) ఎండ్ కార్డ్ పడింది. కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇరు దేశాలు  అధికారికంగా ప్రకటించాయి. దీనంతటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఆయనే స్వయంగా మీడియాతో వెల్లడించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో ఏర్పడిన శాంతి ఒప్పందాన్ని భారత్, పాక్ ప్రభుత్వాలు కూడా వేరువేరు ప్రకటనల ద్వారా తెలిపాయి.

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

దీనిపై భారత విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా స్పందించారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినట్లు తెలిపారు. మధ్యాహ్నం 3:35 సమయంలో పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) భారత్ ఆర్మీ అధికారితో మాట్లాడినట్లు వెల్లడించారు. ఇరు దేశాలు అన్ని రకాల సైనిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయని ఆయన స్పష్టం చేశారు. రాబోయే మే 12న పాక్‌తో నేరుగా చర్చలు జరగనున్నట్లు కూడా తెలియజేశారు.

 Also Read: BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్

IPL 2025 Reschedule

యుద్ధం ముగిసిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు మంచి వార్త అందింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఒక వారం పాటు ఐపీఎల్ 2025ను నిలిపివేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మే 8న జరగాల్సిన పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో టోర్నమెంట్ షెడ్యూల్‌లో తాత్కాలిక మార్పులు చోటు చేసుకున్నాయి.

అయితే యుద్ధం ముగియడంతో ఇప్పుడు పరిస్ధితులు మారాయి. దేశాల మధ్య నెలకొన్న శాంతియుత వాతావరణం నేపథ్యంగా ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మే 9న బీసీసీఐ అత్యవసరంగా సమావేశమై, పరిస్థితిని సమీక్షించి టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

 Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

పంజాబ్ vs ఢిల్లీ మ్యాచ్ తిరిగి జరగనుందా?

రద్దయిన మ్యాచ్‌ తోనే మళ్ళీ ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుందా అని ఆసక్తికర చర్చ మొదలైంది. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆగిపోయిన మ్యాచ్ తిరిగి నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే ఆ మ్యాచ్‌కు సంబంధించి పాయింట్లు ఇప్పటికీ ఇరు జట్ల ఖాతాల్లోకి జమ చేయలేదు. అయితే అందుకు సంబంధించి బీసీసీఐ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా,  దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

 S.NO    జట్టు పేరు పాయింట్లు స్థానం 
1 గుజరాత్ టైటాన్స్      16 టాప్-2
2 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 టాప్-2
3 పంజాబ్ కింగ్స్  15 ప్లేఆఫ్స్ రేసులో
4 ముంబై ఇండియన్స్ 14 ప్లేఆఫ్స్ రేసులో
5 ఢిల్లీ క్యాపిటల్స్  13 ప్లేఆఫ్స్ రేసులో
6 కోల్‌కతా నైట్‌రైడర్స్ 11 ప్లేఆఫ్స్ రేసులో
7 లక్నో సూపర్ జెయింట్స్  10 ప్లేఆఫ్స్ రేసులో
8  సన్‌రైజర్స్ హైదరాబాద్ - ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటికీ
9 రాజస్థాన్ రాయల్స్  - ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటికీ
10  చెన్నై సూపర్ కింగ్స్   - ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటికీ

గమనిక: హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై జట్లకు ఇంకా 2-3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి కానీ ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశాలు లేవు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు