సీఎస్‌కే ఓటమి.. కానీ భారీ రికార్డు క్రియేట్ చేసిన ధోని

ఐపీఎల్‌లో సీఎస్‌కే, ఆర్సీబీ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌‌కే ఓటమిపాలైంది. ఈ జట్టులో సీఎస్‌కే ఓడిపోయినా కూడా ఎంఎస్ దోని రికార్డు క్రియేట్ చేశాడు. సీఎస్‌కే తరపున 236 మ్యాచ్‌ల్లో 4693 అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 

New Update
MS Dhoni : ఐపీఎల్‎లో ఎంఎస్ ధోనీ సరికొత్త రికార్డ్..!

MS Dhoni

ఐపీఎల్‌-2025లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్‌కే చేధించలేకపోయింది. చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమి పాలైనప్పటికి .. ఆ జట్టు లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ ఎం​ఎస్ ధోని మాత్రం తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను అలరించాడు. 

ఇది కూడా చూడండి: CSK VS RCB: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

ఇది కూడా చూడండి: Priyanka Gandhi: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

అరుదైన రికార్డు క్రియేట్ చేసిన ధోని

తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తనదైన స్టైల్లో షాట్లూ ఆడుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ధోని.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ధోని ఓ అరుదైన రికార్డును తన పేరిట క్రియేట్ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా రికార్డు క్రియేట్ చేశాడు. 

ఇది కూడా చూడండి:  Israel-Netanyahu: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

ఇప్పటి వరకు మొత్తం 236 మ్యాచ్‌లు ఆడి ధోని 4693 ప‌రుగులు చేశాడు. అయితే ఇంతకు ముందు ఈ రికార్డు సురేష్ రైనాపైన ఉండేది. రైనా సీఎస్‌కే త‌ర‌పున 4,687 ప‌రుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని పరుగులు చేయడంతో సీఎస్‌కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాడిగా మొదటి ప్లేస్‌లో ఉన్నాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు