/rtv/media/media_files/2025/05/13/TSLTOODpHaxEyUf5OOAH.jpg)
IPL 2025 DJ, cheer leaders cancel
IPL 2025: భారత్-పాక్ యుద్ధం వేళ ఐపీఎల్ నిర్వహకులకు మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ కీలక సూచనలు చేశారు. పహల్గాంతోపాటు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు సంఘీభావంగా మిగిలిన మ్యాచ్ల్లో వినోద కార్యక్రమాలు నిర్వహించకూదన్నారు. డీజేలు, చీర్ లీడర్స్ బంద్ పెట్టాలని సూచించారు.
హంగూ ఆర్భాటాలు వద్దు..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీల్ గావస్కర్.. భారత్ -పాక్ యుద్ధంలో ఎంతోమంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. కావున ఆ కుటుంబాలకు సంఘీభావంగా ఐపీఎల్ మిగతా సీజన్లో ఎంటర్ టైన్ మెంట్ బంద్ చేయాలన్నారు. ‘పాక్ తో పోరులో కొన్ని కుటుంబాలు తమ సన్నిహితులను, ప్రియమైన వారిని కోల్పోయాయి. వారందరికీ గౌరవసూచకంగా ఐపీఎల్ సీజన్లో మిగిలిన మ్యాచ్లను హంగూ ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలి. ఇది నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే చేస్తారని ఆశిస్తున్నా. ప్రేక్షకులను అనుమతించండి.. కానీ ఆట వరకే పరిమితం చేయండి. చీర్ లీడర్స్, ఓవర్ల మధ్యలో డీజే పాటలు ప్లే చేయొద్దు. అమరుల కుటుంబాలను గౌరవించడానికి ఇదొక గొప్ప మార్గం’ అని చెప్పారు.
IPL 2025: 10 ఓవర్లు కాదు 20.. పంజాబ్, ఢిల్లీ మ్యాచ్పై బిగ్ అప్ డేట్!
ఇక మే 8న వాయిదా వేసిన టోర్నీ మే 17 నుంచి మళ్లీ మొదలుకానుంది. మే 8న 10 ఓవర్ల పాటు సాగిన ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్ 24న నిర్వహించనున్నారు. వేదికలు కూడా మారిపోయాయి. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల వేదికలు ఖరారు కావాల్సి ఉండగా జూన్ 3న ఫైనల్ జరిగే అవకాశం ఉంది.
Sunil Gavaskar Comments | today telugu news