Asia Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ హాకీ జట్టు.. ఆసియా కప్ 2025లో విజయం

చరిత్ర సృష్టించిన భారత హాకీ జట్టు పురుషుల హాకీ ఆసియా కప్ 2025లో ఛాంపియన్లుగా అవతరించింది. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను 4-1 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో వచ్చే ఏడాది హాకీ ప్రపంచ కప్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది.

New Update
Indian hockey team win

ఆసియా కప్ 2025లో భారత్ హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. పురుషుల హాకీ టీం ఆసియా కప్ 2025లో ఛాంపియన్లుగా అవతరించింది. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాని 4-1 తేడాతో చిత్తు చేసి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం ద్వారా వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న హాకీ ప్రపంచ కప్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది.

బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ ఆరంభంలోనే దూకుడుగా ఆడిన భారత్, మొదటి నిమిషంలోనే సుఖ్‌జీత్ సింగ్ ద్వారా మొదటి గోల్ సాధించింది. ఆ తర్వాత, జుగ్ రాజ్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను మిస్ చేసినప్పటికీ, భారత్ ఒత్తిడిని కొనసాగించింది. మొదటి అర్ధభాగం ముగిసేలోపే దిల్ ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి భారత్‌కు 2-0 ఆధిక్యం అందించాడు.

మూడో క్వార్టర్‌లో, రాజేందర్ గోల్ చేసి స్కోర్‌ను 3-0కి పెంచాడు. దీంతో భారత్ విజయం దాదాపు ఖాయమైంది. చివరి క్వార్టర్‌లో అమిత్ రోహిదాస్ ఒక పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోర్‌ను 4-0కి పెంచాడు. సౌత్ కొరియా చివరి నిమిషాల్లో ఒక గోల్ చేసి ఓటమి అంతరాన్ని తగ్గించుకోగలిగింది.

ఈ విజయం భారత పురుషుల హాకీ జట్టుకు నాలుగవ ఆసియా కప్ టైటిల్‌ను తెచ్చిపెట్టింది. గతంలో 2003, 2007, 2017లో భారత్ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నమెంట్‌లో అజేయంగా నిలిచి, అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత జట్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఫైనల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన దిల్ ప్రీత్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం భారత హాకీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Advertisment
తాజా కథనాలు