IND vs SL : ట్రై సిరీస్ ఫైనల్ .. శ్రీలంక ఫట్.. ఇండియా సూపర్ విక్టరీ!

ట్రై సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో లంక జట్టు 245 పరుగులకు మాత్రమే ఆలౌట్ అయింది.

New Update
ind-vs-sl womes

ind-vs-sl womes

ట్రై సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు 97 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 342 పరుగులు చేసింది.  మంధాన 101 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 116 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్, ముఖ్యంగా హర్లీన్ డియోల్ (47), హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమిమా రోడ్రిగ్స్ (44) కీలక పాత్ర పోషించారు.

Also Read :  ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!

Also Read :  మోదీ ఇంత వీక్ అనుకోలేదు.. ప్రతీ భారతీయుడిని కించపరిచాడు.. హర్ష కుమార్ ఎమోషనల్

245 పరుగులకు ఆలౌట్  

లక్ష్య ఛేదనలో లంక జట్టు 245 పరుగులకు మాత్రమే ఆలౌట్ అయింది. శ్రీలంక ఆటగాళ్లలో కెప్టెన్ చమరి అథపత్తు (51), నీలాక్షిక సిల్వా (48) అత్యధిక పరుగులు సాధించారు. భారత బౌలర్లలో అమన్‌జోత్ 54 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, రాణా 38 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా ఈ సిరీస్‌లో 15 వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో స్నేహ్ రాణా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. 

Also Read :  ఏపీలో పాకిస్తాన్ కాలనీ పేరు మార్పు.. కొత్త పేరు ఏంటంటే?

సంక్షిప్త స్కోర్లు:

భారత్ 50 ఓవర్లలో 342/7 (స్మృతి మంధాన 116, హర్లీన్ డియోల్ 47, జెమిమా రోడ్రిగ్స్ 44, హర్మన్‌ప్రీత్ కౌర్ 41; సుగండిక కుమారి 2/59, దేవ్మీ విహంగ 2/69, మల్కీ మదార 2/74).

శ్రీలంక 48.2 ఓవర్లలో 245 ఆలౌట్ (విష్మి గుణరత్నే 36, చమరి అతపత్తు 51, నీలక్షిక సిల్వా 48; అమంజోత్ కౌర్ 3/54, స్నేహ రాణా 4/38). 

Also Read :  Rahul-Modi: ''ఆ విషయాలు చెప్పాల్సిందే''.. ప్రధానికి రాహుల్ గాంధీ సంచలన లేఖ..

 ind-vs-sl | sports | cricket 

Advertisment
Advertisment
తాజా కథనాలు