/rtv/media/media_files/2025/03/02/R4tTtc626R7CaP3L1id9.jpg)
ind vs nz live score.. Photograph: (ind vs nz live score..)
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటింగ్ తాజాగా ముగిసింది. టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. దీంతో న్యూజిలాండ్ ముందు 250 టార్గెట్ ఉంది.
ఇది కూడా చూడండి: హిందువుగానే పుట్టా.. అలాగే చనిపోతా : డీకే శివకుమార్ సంచలన కామెంట్స్ !
ఇక భారత్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ అదరగొట్టేశాడు.98 బంతుల్లో 79 పరుగులు చేసి ఈ మ్యాచ్లో హైయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్లు బాది కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే అక్షర్ పటేల్ సైతం మెరుపు ఇన్సింగ్తో ఆకట్టుకున్నాడు. 61 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 1 సిక్స్తో రాణించాడు.
ఇది కూడా చూడండి: TG News: గద్దర్ సినీ అవార్డులపై భట్టి కీలక ప్రకటన.. ఆ పండగరోజే ప్రారంభం!
హార్దిక్ పాండ్య రచ్చ
ఇక చివర్లో హార్దిక్ పాండ్య అయితే రచ్చ రచ్చ చేశాడు. పరుగుల వర్షం కురిపించాడు. 45 బంతుల్లో 45 పరుగులు సాధించి భారత్కు భారీ స్కోర్ అందించాడు. అందులో 4 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఇక కేఎల్ రాహుల్ (23), జడేజా (16) పరుగులు సాధించారు. రోహిత్ శర్మ (15) పరుగులు, శుభ్మన్ గిల్ (2) పరుగులు, విరాట్ కోహ్లీ (11) పరుగులతో అభిమానులను నిరాశపరిచారు. ఆట ప్రారంభమయ్యే సమయంలో భారత్ 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇది కూడా చూడండి: USAID: ట్రంప్ దెబ్బకు అబ్బా అంటున్న ట్రాన్స్జెండర్లు.. భారత్లోనూ మూతపడ్డ ఆ క్లినిక్లు!
ముగ్గురు స్టార్ల ఔట్ అనంతరం
భారత్ స్టార్ బ్యాటర్లు.. గిల్, రోహిత్, కోహ్లీ ఔటయిన అనంతరం శ్రేయస్, అక్షర్ పటేల్ టీమ్ఇండియాను ఆదుకున్నారు. చాలా ఓపిగ్గా ఆడుతూ పరుగులు రాబట్టారు. నాలుగో వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడీ నెలకొల్పింది. చూడాలి మరి కివీస్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో.
ఇది కూడా చూడండి: IAS అధికారికి వంగా మాస్ కౌంటర్ .. అది అనవసరమంటూ..